News February 4, 2025
జగిత్యాల మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జగిత్యాల మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి డీ.ప్రకాష్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన కందులను ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి రూ.7,550 కనీస మద్దతు ధర పొందాలన్నారు. తక్కువ ధరకు దళారులకు అమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డీఎం హబీబ్, మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు.
Similar News
News April 14, 2026
HYD: 8712661212 నం.కు కాల్ చేయండి!

HYDలో మామిడి పండ్లు కుళ్లిపోయినవి, నాణ్యతపై అనుమానం ఉన్నవి విక్రయిస్తే వెంటనే స్పందించాలి. అలాంటి ఘటనలు గమనించిన వినియోగదారులు <<8712661212>>8712661212<<>> నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికార యంత్రాంగం సూచించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఫుడ్ సేఫ్టీ H-FAST విభాగం ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
News April 14, 2026
HYD: 8712661212 నం.కు కాల్ చేయండి!

హైదరాబాద్ లో మామిడి పండ్లు కుళ్లిపోయినవి, నాణ్యతపై అనుమానం ఉన్నవి విక్రయిస్తే వెంటనే స్పందించాలి. అలాంటి ఘటనలు గమనించిన వినియోగదారులు 87126 61212 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికార యంత్రాంగం సూచించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఫుడ్ సేఫ్టీ H-FAST విభాగం ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
News April 14, 2026
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే?

గతేడాది సూపర్ హిట్గా నిలిచిన ‘OG’ సినిమా పార్ట్-2 పనులు మొదలైనట్లు సమాచారం. ఇందులో పవర్ స్టార్ మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్ మరో లెవెల్లో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ఓజస్ గంభీర-ర్యాంపేజ్ బిగిన్స్’ టైటిల్ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తాయని టాక్. పవన్ డేట్స్ను బట్టి షూటింగ్ మొదలవుతుందట.


