News February 18, 2025

జగిత్యాల మార్కెట్లో నేటి ధరలు ఇలా

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. కందులు గరిష్ఠంగా రూ.7250 వరకు పలికాయి. కనిష్ఠ ధర రూ.4259గా ఉంది. అనుములు రూ.5000 నుంచి రూ. 7000 మధ్య పలికాయి. మక్కలు రూ.2121 నుంచి రూ.2266 మధ్య పలికాయి. వరి ధాన్యం (HMT) రూ.2175, వరి ధాన్యం(JSR) రూ.2645గా పలికాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.

Similar News

News December 17, 2025

SRD: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి.. ఉప సర్పంచ్

image

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. స్వగ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు సర్పంచ్ కావాలనుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. అయితే రిజర్వేషన్ అనుకూలించక పోవడంతో తన అనుచరుడు అనిల్ కుమార్‌ను ఎన్నికల్లో నిలబెట్టి సర్పంచ్‌గా గెలిపించుకున్నాడు. తాను 11 వార్డ్ మెంబర్‌గా గెలిచి ఉపసర్పంచిగా ఎన్నికయ్యాడు.

News December 17, 2025

8,113పోస్టులు.. CBAT షెడ్యూల్ విడుదల

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గతేడాది విడుదల చేసిన 8,113 <>NTPC<<>> పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ అందించింది. డిసెంబర్ 15న సీబీటీ 2 ఫలితాలు విడుదల చేయగా.. తాజాగా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్(CBAT)ను డిసెంబర్ 28న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు వెబ్‌సైట్ నుంచి తీసుకోవచ్చని తెలిపింది. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in

News December 17, 2025

1147 22A భూ సమస్యలను పరిష్కరించాం: నాదెండ్ల

image

ఏలూరు జిల్లాలో వ్యాప్తంగా 22A భూ సమస్యల దరఖాస్తులు 1199 అందగా, వాటిలో 1147 దరఖాస్తులను పరిష్కరించామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మనోహర్ మంగళవారం తెలిపారు.142. 04 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించామన్నారు. మరో 32 ఎకరాలకు సంబంధించి 11 కేసులు పెండింగ్ ఉన్నాయని, వాటిలో 8 కేసులను వారంలోగా, 2 కేసులు 2 వారంలోగా పరిష్కారానికి చర్యలు, దేవాదాయ శాఖ సంబంధించిన ఒక కేసును నెలరోజుల్లోగా పరిష్కరించాలన్నారు.