News March 6, 2025

జగిత్యాల: మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి: అడిషనల్ కలెక్టర్

image

ఈనెల 17 లోగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు చెల్లించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో యాసంగి 2023-24 కు సంబంధించి సీఎంఆర్ చెల్లింపులపై బాయిల్డ్ రైస్ మిల్లర్లతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. బకాయిలు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి, మేనేజర్, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 10, 2026

యుద్ధం సెగ.. పాక్ కఠిన నిర్ణయాలు

image

ఇరాన్ యుద్ధం సెగ పాక్‌కు గట్టిగానే తగులుతోంది. ఇంధన కొరతను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ వాహనాల ఇంధన కోటాలో 50% కోత విధించింది. 60% వాహనాలను నడపొద్దని నిర్ణయించింది. మంత్రులు, ఎంపీల జీతాల్లో కోత పెట్టింది. ఆఫీసులను వారానికి 4 రోజులు మాత్రమే తెరవనుంది. స్కూళ్లకు 15 రోజులు సెలవులిచ్చింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని సూచించింది.

News March 10, 2026

వాడిన నూనె వాడితే క్యాన్సర్ ముప్పు: రామయ్య

image

అమలాపురం హోటళ్లు, రెస్టారెంట్లలో వాడిన వంట నూనెను తిరిగి వాడటం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని ఆహార భద్రతా అధికారి రామయ్య హెచ్చరించారు. సోమవారం యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూనెను పదేపదే వేడి చేయడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. మిగిలిన నూనెను నిల్వ చేయరాదని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

News March 9, 2026

నెల్లూరులో విషాదం.. బాలుడి అక్కడికక్కడే మృతి

image

ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాలుడు బైక్‌ని తీసుకుని స్నేహితుని కలిసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్‌లోని కలివెలపాలెం గ్రామానికి చెందిన వివాన్ (16) ఇంట్లో ఎవరు లేకపోవడంతో బైక్‌ని తీసుకొని నెల్లూరు వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొని తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.