News November 30, 2025
జగిత్యాల: ముగిసిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2 రోజులుగా జరుగుతున్న వైజ్ఞానిక ప్రదర్శన శనివారంతో ముగిసింది. ఈ ప్రదర్శనలో 450 మంది విద్యార్థులు తమ నూతన ఆవిష్కరణలు ప్రదర్శించారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న 350 ఎగ్జిబిట్స్ కు 7 ఉప అంశాలకు జిల్లా నుండి రాష్ట్రస్థాయికి జూనియర్ విభాగంలో ఏడు, సీనియర్ విభాగంలో ఏడు,111 ఇన్స్పైర్ ప్రదర్శనలకు 11 ఎంపికయ్యాయి. డీఈఓ రాము తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 4, 2025
సిరిసిల్ల జిల్లాలో 657 మంది బైండోవర్: SP

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 158 కేసులలో 657మందిని బైండోవర్ చేసినట్టు ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల నామినేషన్ కేంద్రాలు, చెక్ పోస్టులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించి 20 కేసుల్లో 209 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
News December 4, 2025
ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలి: CM

ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని CM రేవంత్ రెడ్డి అన్నారు. బుధవార ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇచ్చేవి కావని గుర్తు చేశారు. సచివాలయానికి రానివ్వకుండా తనను, మంత్రి సీతక్కను అడ్డుకున్నారని తెలిపారు.
News December 4, 2025
వరంగల్: పీ.డీ.ఎస్.యూ రాష్ట్ర మహాసభలు వాయిదా..!

డిసెంబర్ 10, 11, 12 తేదీలలో వరంగల్ నగరంలో నిర్వహించనున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా 2026 జనవరి 5, 6, 7 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి.శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు తెలిపారు.


