News April 3, 2025

జగిత్యాల: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. PLEASE SHARE IT.

Similar News

News September 18, 2025

సిరిసిల్ల: ‘సైబర్‌ నేరాల నియంత్రణే లక్ష్యంగా పని చేయాలి’

image

సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ పి. గీతే సైబర్ వారియర్లకు సూచించారు. సైబర్ నేరాల కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సైబర్ వారియర్లకు ప్రోత్సాహకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. సైబర్ నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం చాలా ముఖ్యమన్నారు. భవిష్యత్తులో మరింత నైపుణ్యంతో సైబర్ నేరాలను ఛేదించాలని ఆయన వారియర్లను కోరారు.

News September 18, 2025

KNR: ‘ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలి’

image

అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాలు ఈనెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విద్యానగర్ లోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజి ఉండడం ద్వారా అంతర్జాతీయంగా దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు.

News September 18, 2025

పనులు నాణ్యతతో చేపట్టండి: కలెక్టర్

image

పాణ్యం నుంచి గోరుకల్లు రిజర్వాయర్ వరకు రూ.6.29 కోట్లతో నిర్మించిన రహదారి పనులను కలెక్టర్ జి.రాజకుమారి గురువారం పరిశీలించారు. కొండజుటూరు, గోరుకల్లు, ఎస్.కొట్టాల, దుర్వేసి గ్రామాలను కలుపుతూ 13.125 కి.మీ. పొడవున పూర్తయిన రహదారి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు, సాగు నీరు, రవాణా సౌకర్యాలు కల్పించడమే ఈ పనుల ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు.