News March 7, 2025
జగిత్యాల: మూడవరోజు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు

జగిత్యాల జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో మొత్తం 7313 మంది విద్యార్థులకు గాను 7108 విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తెలిపారు. 205 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు 6271 మందికి 6144 విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు 1042 మందికి 964 విద్యార్థులు హాజరయ్యారన్నారు.
Similar News
News September 17, 2025
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్

మాచర్లలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం చేశారు. పర్యటనను విజయవంతం చేయడానికి వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని, అందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
News September 17, 2025
VKB: స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్

వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెగా హెల్త్ క్యాంప్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మహిళల ఆరోగ్యం బలపడితే కుటుంబం బలపడుతుందని, శిబిరం ద్వారా మహిళలకు, పిల్లలకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలు అందించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
News September 17, 2025
రేపు భారీ వర్షాలు

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.