News August 9, 2024
జగిత్యాల: మూడు నెలల్లో ముగ్గురి మృతి

మూడు నెలల్లో ముగ్గురు కుటుంబీకులు మృతి చెందారు. మల్యాల మండలం రామన్నపేటకు చెందిన వకుళాభరణం శ్రీనివాస్(62) ఆయన భార్య అరుణ(55) సర్పంచిగా పని చేశారు. వీరి పెద్ద కొడుకు 3 నెలల కిందట ఫ్రేమ విఫలమై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ మూత్రపిండాలు విఫలమై ఈ నెల 5న మృతి చెందారు. 3 నెలల కిందట కొడుకు, 3 రోజుల కిందట భర్త మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరుణ అనారోగ్యంతో గురువారం చనిపోయారు.
Similar News
News February 15, 2026
కరీంనగర్ మేయర్ పీఠం కమలం వశమే!

కరీంనగర్ నగరపాలక సంస్థలో కమల వికాసం ఖాయమైంది. బీజేపీ గెలిచిన 30 స్థానాలకు తోడు, ఇప్పటికే ఇద్దరు చేరగా.. తాజాగా శనివారం మరో ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీజేపీ బలం ఎక్స్-అఫీషియో ఓటుతో కలిపి 35కు చేరి, మ్యాజిక్ ఫిగర్ (34) దాటింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు తాజా చేరికలతో గండిపడింది.
News February 14, 2026
KNR: కాంగ్రెస్ నేతపై దాడి.. కేసు నమోదు

కరీంనగర్ రాజకీయ కక్షలతో కాంగ్రెస్ నాయకుడు శ్యాంసుందర్ రెడ్డిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కార్పొరేటర్ భూమయ్య భార్యకు మద్దతుగా ప్రచారం చేశారనే కోపంతో, మాజీ కార్పొరేటర్ సోదరుడు జంగిలి సతీశ్తో పాటు మరికొందరు ఆయనపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.
News February 14, 2026
కరీంనగర్ పీఠంపై ‘క్యాంపు’ రాజకీయం

కరీంనగర్ నగర పాలక సంస్థలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. 30 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, మరో ఇద్దరిని చేర్చుకొని బలాన్ని 32కు పెంచుకుంది. పీఠం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఏఐఎఫ్బీ పార్టీలు ఏకమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు చేజారకుండా ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.


