News March 28, 2025
జగిత్యాల: మెరుగైన విద్యుత్ అందించడానికి లైన్లలో కెపాసిటర్ల బిగింపు : SE

జగిత్యాల సర్కిల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడానికి విద్యుత్ లైన్లలో కెపాసిటర్లను అమర్చుతున్నామని జగిత్యాల జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలియానాయక్ గురువారం తెలిపారు. వోల్టేజ్ లో విద్యుత్ హెచ్చు తగ్గులు లేకుండా కెపాసిటర్లు ఉపయోగపడతాయని అన్నారు. ఇప్పటివరకు 41 కెపాసిటర్లు బిగించామని తెలిపారు. వీటివల్ల ట్రాన్స్ఫార్మర్స్పై లోడ్ తగ్గి మోటార్లు కాలిపోకుండా ఉంటాయి
Similar News
News January 6, 2026
అతిగా దుస్తులు కొంటున్నారా?

‘ఫాస్ట్ ఫ్యాషన్’ పేరుతో మనం కొంటున్న దుస్తులు పర్యావరణానికి శాపంగా మారుతున్నాయి. ఏటా వెలువడుతున్న క్లాతింగ్ వేస్ట్ సముద్రాలను, నేలను విషతుల్యం చేస్తున్నాయి. మనం ధరించే ఒక్క జత బట్టల తయారీకి ఎన్నో లీటర్ల నీరు ఖర్చవుతుంది. అందుకే అవసరముంటేనే దుస్తులు కొనండి. ఉన్నవాటిని ఎక్కువ కాలం వాడండి. ఫ్యాషన్ కోసం ప్రకృతిని కలుషితం చేయకండి. బాధ్యతగా బట్టలు కొందాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం. SHARE IT
News January 6, 2026
చివరి టెస్టు.. పట్టు బిగించిన ఆసీస్

యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ 384 పరుగులకు ఆలౌటవగా, ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 518/7 స్కోర్ చేసింది. దీంతో 134 పరుగుల లీడ్ సాధించింది. హెడ్ 163, స్టీవ్ స్మిత్ 129* అద్భుత సెంచరీలు చేశారు. కార్సే 3, స్టోక్స్ 2, జోష్, జాకోబ్ చెరో వికెట్ తీశారు. కాగా ఇప్పటికే 3-1 తేడాతో ఆసీస్ సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
News January 6, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,160
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,027
* వెండి 10 గ్రాములు ధర రూ.2,520.


