News February 3, 2025

జగిత్యాల: మొదలైన ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్..

image

నేటి నుంచి ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయని, నాలుగు స్పెల్స్‌లో జరుగుతాయని జగిత్యాల ఇంటర్‌ నోడల్‌ అధికారి బొప్పరాతి నారాయణ తెలిపారు. పరీక్షలు వచ్చేనెల 25వ తేదీ వరకు జరగనున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫస్టియర్‌లో 7,054 మంది, సెకండియర్‌లో 6,141 మంది పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ప్రాక్టికల్స్‌‌కు 29 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News September 17, 2025

నిజాంకు వ్యతిరేకంగా దామెరకుంట వాసుల పోరుబాట!

image

నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో కాటారం మండలం దామెరకుంట వాసులు కీలకపాత్ర పోషించారు. వారిలో రాగం వెంకటయ్య, ఐత చిన్న పోచిరెడ్డి, పెద్ద పోచిరెడ్డి, రాజిరెడ్డి, బాసాని బక్క రాజయ్య, కోడిపెల్లి వెంకటయ్య సహా పలువురు యోథులు ఉన్నారు. ఈ పోరాటంలో ఐత చిన్న పోచిరెడ్డిని ధన్వాడ వద్ద రజాకార్లు చంపడం గ్రామంలో విషాదం నింపింది.

News September 17, 2025

అనకాపల్లి: 30 రోజుల్లో 14,86,513 మహిళలు ఉచిత ప్రయాణం

image

స్త్రీ శక్తి పథకం కింద అనకాపల్లి జిల్లాలో గల నర్సీపట్నం, అనకాపల్లి డిపోల నుంచి నడుస్తున్న బస్సుల్లో నెల రోజుల్లో 14,86,513 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి వి.ప్రవీణ తెలిపారు. ఈ మేరకు మహిళలు రూ.5.35 కోట్ల మేర లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగిందన్నారు. అనకాపల్లి డిపోలో 100% ఓఆర్ నమోదు అయిందన్నారు.

News September 17, 2025

ADB: తెలంగాణకు అండ.. కొండా లక్ష్మణ్

image

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప నేత కొండా లక్ష్మణ్ బాపూజీ. ASF(D)లో పుట్టిన ఆయన తెలంగాణ ఉద్యమానికి ఆది గురువుగా నిలిచారు. 1969లో ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ‘తెలంగాణ పీపుల్స్ పార్టీ’ స్థాపించడమే కాక.. టీఆర్ఎస్ ఆవిర్భావంలోనూ కీలకంగా వ్యవహరించారు. 96 ఏళ్లప్పుడూ స్వరాష్ట్రం కోసం ఢిల్లీలో నిరాహార దీక్ష చేశారు.