News September 6, 2025

జగిత్యాల: రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డులు అందుకున్న అధ్యాపకులు

image

జగిత్యాల SKNR ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో జంతు శాస్త్ర సహాయచార్యులు పర్లపల్లి రాజు, ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ నీలి వాసవి శుక్రవారం రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డులు అందుకున్నారు. విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, వీసీలు ఉమా శంకర్, ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.

Similar News

News September 6, 2025

SRD: పిల్లలను చంపేదుకు చేతులెలా వచ్చాయి తల్లీ !

image

సంగారెడ్డి(D) నిజాంపేటలో <<17625700>>ఇద్దరు పిల్లలను చంపి తల్లి<<>> ఉరేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దామరచెరువుకు చెందిన సంగమేశ్వర్‌తో ప్రేమలకు మూడున్నరేళ్ల క్రితం పెళ్లైంది. రెండు రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె నిన్న ఈ దారుణానికి పాల్పడింది. ‘భరించలేని కష్టమొచ్చిన సరేనమ్మా.. పిల్లలను చంపేదుకు చేతులెలా వచ్చాయి తల్లీ’ అని బంధువులు, గ్రామస్థులు కన్నీటి పర్యాంతమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2025

కాసేపట్లో KCRతో హరీశ్‌రావు భేటీ!

image

TG: BRS నేత, మాజీమంత్రి హరీశ్ రావు లండన్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం KCRతో హరీశ్ రావు భేటీ కానున్నారు. కవిత ఆరోపణలపై ఆయన కేసీఆర్‌తో చర్చించే అవకాశముంది. కవితను సస్పెండ్ చేయడంతో పార్టీ హరీశ్‌రావు వైపే ఉందని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కవిత, విపక్షాల విమర్శలు, కాళేశ్వరం నివేదిక అంశంపైనా వీరి మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

News September 6, 2025

ఇక IT ఎగుమతులపైనా US టారిఫ్స్?

image

భారత వస్తువులపై 50% టారిఫ్స్ వేస్తున్న US త్వరలో IT సేవలపైనా ట్యాక్స్ విధించొచ్చని తెలుస్తోంది. INDలోని చాలా IT కంపెనీలు USకు ఔట్‌సోర్సింగ్‌ సేవలందిస్తున్నాయి. వస్తువుల్లాగే లాగే సేవలపైనా TAX చెల్లించాలని US మాజీ నేవీ ఆఫీసర్ ట్వీట్ చేశారు. దీన్ని ట్రంప్ అడ్వైజర్ నవరో రీపోస్ట్ చేయడంతో భారత IT కంపెనీల్లో ఆందోళన మొదలైంది. దీనిని అమెరికన్ టెక్ వర్కర్స్ స్వాగతిస్తుండగా ఇండియన్ టెకీస్ ఖండిస్తున్నారు.