News November 10, 2025

జగిత్యాల: ‘రూ.100 కోట్ల భూకబ్జాపై విచారణ వేగవంతం చేయండి’

image

జగిత్యాల పట్టణంలో సంచలనంగా మారిన రూ.100 కోట్ల భూకబ్జాపై వేగవంతంగా విచారణ జరపాలని మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కొత్త బస్టాండ్ పరిసర సర్వే నం.138 సహా పలు భూములు అన్యాక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించబడితే స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ అంశంపై వివిధ రాజకీయ వర్గాల మద్దతు లభిస్తోంది.

Similar News

News November 10, 2025

SRPT: ప్రజావాణిలో 10 ఫిర్యాదులు: ఎస్పీ

image

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే/ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ఫిర్యాదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, ఫిర్యాదు సమస్యను తెలుసుకుని పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. 10 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

News November 10, 2025

ఏయూ: ఎంసీఏ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఏయూ పరిధిలోని మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఆగస్టు నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేసి పరీక్షలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఈనెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పరీక్షలు విభాగం అధికారులు తెలిపారు.

News November 10, 2025

విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్ష

image

విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్రానికి గ్రోత్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేసే అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, జీవన ప్రమాణాలు, తదితర అంశాలతో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు.