News November 28, 2025

జగిత్యాల: రేపటి నుంచి ఇన్‌స్పైర్–సైన్స్ ఎగ్జిబిషన్

image

జగిత్యాల జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ అవార్డుల ప్రదర్శన నవంబర్ 28, 29 తేదీల్లో ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాలలో జరుగనున్నాయి. విజ్ఞాన, గణిత, పర్యావరణ అంశాలపై విద్యార్థులు రూపొందించిన నమూనాలు ప్రదర్శించనున్నారు. సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొంటారని డీఈఓ కె. రాము తెలిపారు. ఉపాధ్యాయుల సన్నాహక సమావేశంలో కమిటీల బాధ్యతలు, భోజన ఏర్పాట్లు, ఎగ్జిబిషన్ వసతులు వివరించారు.

Similar News

News November 28, 2025

నేడు కామారెడ్డికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న PDSU 23వ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరుకానున్నారు. PDSU జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లాలోని పీడీఎస్‌యూ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై, మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

News November 28, 2025

అమలాపురం: 22 మందికి డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 22 మండలాలకు డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తూ కలెక్టర్ మహేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా సచివాలయ పరిపాలన పర్యవేక్షణకు ఈ నియామకాలు చేపట్టారు. గ్రామ పంచాయతీల్లోని సీనియర్ గ్రేడ్-1 కార్యదర్శులకు, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించి డిప్యూటీ ఎంపీడీవోలుగా అవకాశం కల్పించారు.

News November 28, 2025

సికిల్‌సెల్, తలసేమియా రోగుల కోసం ప్రత్యేక శిబిరాలు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్‌సెల్, తలసేమియా దీర్ఘకాలిక రక్త వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరాలను ఈ నెల 29న (శనివారం) ఉదయం 8 గంటలకు అశ్వారావుపేటలో, మధ్యాహ్నం 12:30 గంటలకు నారాయణపురంలోని రైతు వేదికల్లో నిర్వహించనున్నారు.. రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.