News February 24, 2025

జగిత్యాల: రేపట్నుంచి ప్రచారం నిషేధం: కలెక్టర్

image

MDK, NZB, KNR, ALD పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా ఈ నెల 25 సాయంత్రం 4.00 నుంచి ఈ నెల 27 సాయంత్రం 4.00 వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, బల్క్ ఎస్ఎంఎస్‌లు పంపడంపై నిషేధమన్నారు.

Similar News

News December 15, 2025

భారీ జీతంతో మేనేజర్ పోస్టులు

image

<>ఉడిపి <<>>కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 3 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(మెకానికల్/నావల్ ఆర్కిటెక్చర్/మెరైన్ Eng) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. మేనేజర్‌కు నెలకు రూ.1,18,400, డిప్యూటీ మేనేజర్‌కు రూ.98,400 చెల్లిస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News December 15, 2025

రాకెట్ ఉమెన్ ఆఫ్‌ ఇండియా రీతు కరిధాల్

image

లక్నోలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రీతు కరిధాల్ 1997లో ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా చేరారు. ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులైన మార్స్ ఆర్బిటార్ మిషన్, మంగళ్‌యాన్ ప్రయోగాలకు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2019లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2కి మిషన్‌ డైరెక్టర్‌గా రీతూ బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు.

News December 15, 2025

క్యాబేజీలో రెక్కల పురుగు నివారణకు సూచనలు

image

క్యాబేజీలో రెక్కల పురుగు లార్వాలు ఆకుల అడుగు భాగాన చేరి తినడం వల్ల ఆకులు వాడి ఎండిపోతాయి. వీటి ఉద్ధృతి ఎక్కువైతే ఆకులకు రంధ్రాలు పడి క్యాబేజీ పరిమాణం తగ్గుతుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజీ వరుసలకు 2 వరుసల ఆవ మొక్కలను ఎర పంటగా నాటాలి. రెక్కల పురుగు గుడ్లను నాశనం చేసేందుకు 5% వేపగింజల ద్రావణాన్ని, ఉద్ధృతి మరీ ఎక్కువైతే లీటరు నీటికి నోవాల్యురాన్1ml కలిపి కోతకు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.