News December 19, 2025

జగిత్యాల: లక్షలాది భక్తులకు సౌకర్యాలే లక్ష్యం: కలెక్టర్

image

2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి గోదావరి తీరంలోని ఆలయాలు, పుష్కర ఘాట్లు, రహదారులు, పార్కింగ్, తాగునీరు, వసతి సదుపాయాలతో శాశ్వత మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.

Similar News

News February 17, 2026

స్ కోచ్ చెన్నకేశవులకు కోనేరు హంపి ప్రశంసలు

image

విజయవాడలో నిర్వహించిన శాప్ లీగ్ మహోత్సవంలో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సందడి చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నేషనల్ ఆర్బిటర్ అవార్డు గ్రహీత, చెవిటికల్లుకు చెందిన చెస్ కోచ్ గుజ్జర్లపూడి చెన్నకేశవులను ఆమె అభినందించారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలని కోరారు. కఠిన సాధనతోనే చదరంగంలో ఛాంపియన్‌లుగా ఎదగగలరని హంపి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

News February 17, 2026

KNR మేయర్ శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానమిదే..!

image

<<19162897>>శ్రీనివాస్ <<>>2014- 19 వరకు BJP మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2020-25 వరకు KNR మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్‌గా కొనసాగారు. 2021లో కరోనా వ్యాక్సిన్ జిల్లా కన్వీనర్‌గా, 2023-24 వరకు KNR టౌన్ 1 కన్వీనర్‌గా, 2024లో NIFFA రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2025లో చొప్పదండి మండల సర్పంచ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. తాజాగా KNR మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

News February 17, 2026

‘జై హనుమాన్’లో కదలిక.. షూటింగ్‌కి రెడీ!

image

కన్నడ నటుడు రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో ‘జై హనుమాన్’ను 2024 అక్టోబర్‌లో <<14492400>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ఈ నెల 22న మూవీ పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలోని హంపికి దగ్గర్లో హనుమాన్‌హల్లిలోని అంజనాద్రి హిల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పాయి. 2024లో రిలీజైన హనుమాన్‌కు సీక్వెల్‌గా జై హనుమాన్ తెరకెక్కనుంది. ఆంజనేయుడిగా రిషబ్ కనిపించనున్నారు.