News December 4, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.1921, కనిష్ఠ ధర రూ.1731; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2051, కనిష్ఠ ధర రూ.1700; వరి ధాన్యం (HMT) ధర రూ.2301; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.3025, కనిష్ఠ ధర రూ.2100గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News December 4, 2025
మొదటి రోజు ప్రశాంతంగా ముగింపు: జగిత్యాల కలెక్టర్

జగిత్యాల జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది. డిసెంబర్ 3 నాటికి సర్పంచ్ పదవికి 155, వార్డు సభ్యుల పదవులకు 304 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ తెలిపారు. నామినేషన్ కేంద్రాల్లో అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తూ ప్రక్రియను సజావుగా నిర్వహించారు.
News December 4, 2025
ఎడపల్లి: ఎన్నికల విధులను అప్రమత్తతతో నిర్వహించాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులను నిర్వర్తించే అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నెల 11న మండలంలో మొదటి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల నుంచి పోలింగ్ ఏర్పాట్ల వరకు కలెక్టర్ సమీక్షించారు.
News December 4, 2025
ఏలూరు జిల్లా BJP మోర్చా కమిటీల నియామకం

ఏలూరు జిల్లా BJP మోర్చా కమిటీ నియామకాలను జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి కిషోర్ గురువారం ప్రకటించారు. కీర్తి వెంకట రాంప్రసాద్ జిల్లా అధ్యక్షుడిగా, ఇలపకుర్తి కుసుమ కుమారి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అగ్రహారపు వెంకటేశ్వరరావు ఓబీసీ మోర్చా, బుర్రి శేఖర్ ఎస్సీ మోర్చా, సయ్యద్ మీర్ జాఫర్ అలీ మైనారిటీ మోర్చా, అడబాక నాగ సురేష్ యువ మోర్చా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు.


