News December 21, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..!

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో శనివారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.1860, కనిష్ఠ ధర రూ.1559, వరి ధాన్యం 1010 గరిష్ఠంగా రూ.2015, కనిష్ఠ ధర రూ.1800, HMT గరిష్ఠ ధర రూ.2221, కనిష్ఠ ధర రూ.2221, జైశ్రీరాం వరి ధాన్యం గరిష్ఠ ధర రూ.2801, కనిష్ఠ ధర రూ.2500, ధర పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News December 23, 2025
పరుగు పందెంలో సత్తా చాటిన జిల్లా అథ్లెట్లు

కామారెడ్డిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు సాగాయి. ఈ పోటీలను జిల్లా అడిషనల్ కలెక్టర్ మధు మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిభ చాటిన క్రీడాకారులకు బహుమతులు, సర్టిఫికేట్లు అందజేశారు. వీరు వచ్చే ఏడాది JUN 2న గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహిస్తారు.
News December 23, 2025
కార్మికుల క్రమశిక్షణే సింగరేణి బలం: డైరెక్టర్ సూర్యనారాయణ

కార్మికుల శ్రమ, క్రమశిక్షణ, పరస్పర నమ్మకమే సింగరేణికి అసలైన బలమని ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ ఎల్.వి. సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ప్రధాన కార్యాలయంలో జరిగిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. భద్రతకు ప్రాధాన్యమిస్తూ, వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి జెండాను ఆవిష్కరించి, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.
News December 23, 2025
నల్గొండ: ‘అధికారం కోల్పోయాక KTRకు కృష్ణ జలాలు గుర్తుకు రావడం విడ్డూరం’

అధికారం కోల్పోయాక కేటీఆర్, హరీశ్రావుకు కృష్ణ జలాలు గుర్తుకు రావడం విడ్డూరమని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్ నేత మండిపడ్డారు. వారి తీరు సురభి నాటకాలను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి,ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని,రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు.


