News February 5, 2025

జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

image

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్‌ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా ఉండేందుకు నరేశ్ నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

Similar News

News November 8, 2025

కొనికి శివారులో వాగు వద్ద మృతకళేబరం కలకలం

image

ఇంకొల్లు మండలం కొనికి గ్రామంలోని శివారు ప్రాంతంలో ఉన్న వాగు వద్ద పొలాల్లో శనివారం గుర్తుతెలియని మృతకళేబరం కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని ఈ కళేబరాన్ని పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులో కొట్టుకు వచ్చిందా? పలు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.

News November 8, 2025

బోయినపల్లి: డ్యామ్‌పై పిచ్చి మొక్కల బెడద

image

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మన్వాడ వద్ద గల మిడ్ మానేరు డ్యామ్ రోడ్డుపై పిచ్చి మొక్కల బెడద ఎక్కువైంది. కొదురుపాక నుంచి డ్యామ్‌ మీదుగా వెళ్లే రహదారికి ఇరువైపులా పిచ్చి చెట్లు అడ్డంగా పెరగడంతో పర్యాటకులకు, స్థానికులకు ఇబ్బందిగా మారింది. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకుని చెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

News November 8, 2025

KGHలో పవర్ కట్.. ప్రభుత్వం సీరియస్

image

KGHలో గురువారం 10 గంటలపాటు కరెంట్ నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఛైర్మన్‌గా ఉన్న ఈ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ అంతరాయం జరగడంపై ఆరోగ్యశాఖ సీరియస్‌ అయింది. కాగా.. కనీసం జనరేటర్లు కూడా సమకూర్చలేరా అంటూ YCP ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా ఎత్తిచూపింది. ‘ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది’అంటూ YCP నేతలు విమర్శలు గుప్పించారు.