News July 14, 2024
జగిత్యాల: షార్జాలో ఆత్మహత్య.. స్వగ్రామం చేరుకున్న మృతదేహం

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేటకు చెందిన శేఖర్(27) మృతదేహం స్వగ్రామానికి చేరింది. షార్జాలో 20 రోజులక్రితం శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు విషయాన్ని MLC జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో GWPC అధ్యక్షులు నరసింహ, రాము.. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు.
Similar News
News February 10, 2026
కరీంనగర్లో త్రిముఖ పోరు. మేయర్ పీఠం ఎవరిదో?

కాంగ్రెస్, BJP, BRS.. KNR కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. 66 వార్డులు గల నగరంలో పాగా వేసేందుకు ఇప్పటికే బండి సంజయ్, పొన్నం, గంగుల వంటి కీలక నేతలు సహా స్థానిక నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఎంఐఎం కూడా ప్రభావం చూపే ఇక్కడ మెజారిటీ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో పొత్తులు కుదిరే అవకాశం ఉందనే ప్రచారమూ జరుగుతోంది.
News February 10, 2026
KNR: పోలింగ్ రోజున పబ్లిక్ హాలిడే

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహించే కేంద్రాల్లో ఈనెల 10, 11 తేదీల్లో పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న విద్యా సంస్థలు, కార్యాలయాలకు ఈ సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ రోజున ఈనెల 11న సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు.
News February 10, 2026
KNR: నేటి నుంచే ‘సైలెన్స్ పీరియడ్’

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా జిల్లాలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వచ్చినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ 48 గంటల ‘సైలెన్స్ పీరియడ్’లో అభ్యర్థులు ఎలాంటి బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహించరాదని హెచ్చరించారు.


