News March 20, 2025
జగిత్యాల: సీసీ కెమెరాల నిఘాలో 10వ తరగతి పరీక్షలు: కలెక్టర్

ఈనెల 21 నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలు సీసీటీవీ కెమెరాల నిఘాలో జరుగుతాయని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాలో 67 పరీక్ష కేంద్రాలలో 11,865 మంది రెగ్యులర్ విద్యార్థులు, 285 మంది బ్యాక్ లాగ్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లకు అనుమతులు లేదన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు.
Similar News
News November 12, 2025
నేడు కర్నూలుకు గవర్నర్ రాక

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 10.30కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. 11 నుంచి నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరిగే RU నాలుగో కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 4.10కు కర్నూలు నుంచి బయలుదేరి 4.40కు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
News November 12, 2025
నాగార్జునపై కామెంట్స్.. అర్ధరాత్రి సురేఖ ట్వీట్

TG: హీరో నాగార్జున, ఆయన కుటుంబంపై <<14263103>>గతంలో<<>> తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నానని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని రాసుకొచ్చారు. అయితే అసందర్భంగా అర్ధరాత్రి 12 గం.కు సురేఖ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. కాగా ఆమెపై నాగ్ వేసిన పరువునష్టం కేసు కొనసాగుతోంది.
News November 12, 2025
మధ్యాహ్న భోజనంలో ఫిష్ కర్రీ: మంత్రి శ్రీహరి

TG: ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో ఫిష్ కర్రీస్, ఇతర ఆహార పదార్థాలను వండిపెట్టేలా చూస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. త్వరలోనే అమలు చేసేందుకు సీఎం రేవంత్తో మాట్లాడుతానని తెలిపారు. రాష్ట్రంలో 26 వేల నీటి వనరుల్లో చేపపిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. వీటిలో 84 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను రిలీజ్ చేస్తామని చెప్పారు.


