News March 5, 2026
జగిత్యాల: సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన ప్రచార రథం ప్రారంభం

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథక ప్రచార రథాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం ప్రారంభించారు. అనంతరం పథకానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా రెడ్ కో అధికారి మనోహర్, ఆర్డీవో మధుసూదన్, జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, డిపిఆర్ఓ నరేశ్, డిపిఓ మదన్మోహన్, డివైఎస్ఓ రవి కుమార్ పాల్గొన్నారు.
Similar News
News March 9, 2026
పాలమూరు: ఉచిత శిక్షణ.. ఫోన్ చేయండి

MBNRలోని రాజేంద్రనగర్లో DDU-GKY & స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో యువతులకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కో-ఆర్డినేటర్ రవికుమార్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. టెన్త్ పాసైన వారు అర్హులని, ఎంపికైన వారికి ఉచిత శిక్షణతోపాటు వసతి, భోజనం, మెటీరియల్ సదుపాయం కల్పిస్తామని, ఈనెల 20లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాల కోసం 99496 98592కు సంప్రదించాలన్నారు.
SHARE IT
News March 9, 2026
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ధరలు ఇలా..!

ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం ధరలు వెలువడ్డాయి. పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.8,149, వేరుశనగ గరిష్ఠ ధర రూ.8,800, ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,994 పలికాయి. శనగలు గరిష్ఠ ధర రూ 5,061, కందులు గరిష్ఠ ధర రూ. 7,257 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు గడువు ముగియడంతో కేంద్రాలు మూతపడి, పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. వేరుశనగ ధరలు వారం రోజులుగా పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News March 9, 2026
పిఠాపురం: జనసేన ఆవిర్భావ సభపై ఉత్కంఠ

మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసారి భారీ సభ ఉంటుందా లేదా అనే దానిపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ప్రతి సంవత్సరం పిఠాపురంలోనే సభ నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. అయితే సభకు సమయం తక్కువగా ఉండటంతో సోమవారం నాటికి ఎటువంటి ఏర్పాట్లు కనిపించకపోవడం గమనార్హం. దీనిపై అటు శ్రేణుల్లో, ఇటు ప్రజల్లో సందిగ్ధత నెలకొంది.


