News October 13, 2025

జగిత్యాల: స్కాలర్షిప్స్.. 3 రోజులే ఛాన్స్..!

image

BD కార్మికుల పిల్లల స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు ఈనెల 15తో ముగుస్తుందని BD కార్మికుల దవాఖాన వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. బీడీ కార్మికుల పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆన్లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. కాగా, సెప్టెంబర్ 30తో గడువు ముగియాల్సి ఉండగా మరోసారి లాస్ట్ డేట్‌ను 15కు పొడిగించారు.

Similar News

News October 13, 2025

జొన్న సాగు.. మేలైన యాజమాన్య పద్ధతులు

image

తెలుగు రాష్ట్రాల్లో రబీలో జొన్నను OCT రెండో వారం వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు 3KGల మోతాదు, మొక్కల మధ్య 15CM, వరుసల మధ్య 45CM దూరం ఉండేలా విత్తుకోవాలి. KG విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ 70 WS+ 2గ్రా కార్బెండజిమ్‌తో శుద్ధి చేయాలి. విత్తిన తర్వాత 35 రోజులపాటు కలుపు లేకుండా చూసుకోవాలి. దీనివల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది. అంతర పంటలుగా కంది 2:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. అపరాలను కూడా విత్తుకోవచ్చు.

News October 13, 2025

రూల్ ప్రకారం.. ఇంట్లో ఎంత బంగారం ఉండొచ్చు?

image

దేశంలో బంగారం కొనుగోళ్లను పర్యవేక్షించే ఆదాయ పన్ను శాఖ రైడ్స్ సమయంలో సరైన పత్రాలు చూపిస్తే ఎంత బంగారమైనా ఇంట్లో ఉంచుకోవచ్చు. అయితే పత్రాలు లేకున్నా పౌరుల వద్ద కొంతమొత్తంలో బంగారం ఉండేందుకు అనుమతి ఉంది. పెళ్లికాని మహిళలు: 250గ్రా, పెళ్లైన మహిళలు: 500గ్రా. పురుషులు: 100గ్రా. పసిడి కలిగి ఉండొచ్చు. వీటికి వారసత్వంగా, పెళ్లితో కానుకగా వచ్చిన గోల్డ్ అదనంగా ఉంటే అందుకు తగిన డాక్యుమెంట్స్ చూపాలి.

News October 13, 2025

వైకుంఠమే భువి చేరితే.. అదే తిరుమల కొండ

image

తిరుమలను కలియుగ వైకుంఠంగా పేర్కొంటారు. నిజానికి ఇది వైకుంఠంలో భాగమేనని చాలామందికి తెలియదు. ప్రళయ కాలంలో భూమిని పైకి తెచ్చిన విష్ణువు కొంతకాలం ఇక్కడే ఉండాలని సంకల్పించాడు. అప్పుడు శ్రీహరి నివాసానికై గరుత్మంతుడు వైకుంఠం నుంచి తెచ్చిన క్రీడాశైలమే ఈ వేంకటాచలం. దీన్ని సువర్ణముఖి నదికి ఉత్తరాన ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు లక్షలాది భక్తులు దర్శించుకునే తిరుమల కొండగా ప్రసిద్ధి చెందింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>