News March 29, 2024
జగిత్యాల: హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్ట్

జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో ఈ నెల 25న మేడిశెట్టి రమను హత్య చేసిన నిందితుడు బోగు ప్రకాశ్ను గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ సీఐ ఆరీఫ్ అలీఖాన్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల శివారులో గల లక్ష్మీగార్డెన్ వద్ద నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి బైక్, కొడవలి, ఫోను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
Similar News
News December 12, 2025
కరీంనగర్: రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధం

మొదటి విడత ఎన్నికలు పూర్తయినందున, రెండో విడత ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. చిగురుమామిడి మండలంలోని 17, తిమ్మాపూర్లో 23, మానకొండూరులో 17, శంకరపట్నం 29, గన్నేరువరం మండలంలో 27 గ్రామపంచాయతీలకు గాను 1046 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
News December 12, 2025
కరీంనగర్ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిందంటే..?

కరీంనగర్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరిచింది.
చొప్పదండి: 16 GPలకు కాంగ్రెస్ 8 , BRS 6 , ఇతరులు 2
గంగాధర:33 GPలకు కాంగ్రెస్ 9 ,BRS 3 ,BJP 9, ఇతరులు 9
కరీంనగర్ రూరల్: 14 GPలకు కాంగ్రెస్ 6 , BRS 1 , BJP 4 , ఇతరులు 2
కొత్తపల్లి: 6 GPలకు కాంగ్రెస్ 1 , BRS 2 , BJP 1 , ఇతరులు 2
రామడుగు: 23 GPలకు కాంగ్రెస్ 9 , BRS 4 , BJP 5 , ఇతరులు 4
News December 12, 2025
కరీంనగర్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

కరీంనగర్ జిల్లాలో 5 మండలాల్లోని 92 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్గా 81.82 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.


