News February 18, 2026

జగిత్యాల: 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

జగిత్యాల జిల్లాలో 2027 జూలై 23 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల కోసం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల ఘాట్లను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం శాశ్వత మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్, తాగునీరు మరియు పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ధర్మపురి, కోటిలింగాల ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు.

Similar News

News February 18, 2026

మెదక్ కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

image

TG: న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారని ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. అనంతరం తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలిపేసింది. అప్పీల్ చేసుకునేందుకు కలెక్టర్‌కు గడువిచ్చింది.

News February 18, 2026

మాజీ మంత్రి ముద్రగడతో గుడివాడ అమర్నాద్ భేటీ

image

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కలిశారు. మంగళవారం కిర్లంపూడిలోని వారి నివాసంలో ముద్రగడతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు అంబటి రాంబాబు అరెస్టుపై ఇరవురు చర్చించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, భీమిలి వైసీపీ ఇన్‌ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు, బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు.

News February 18, 2026

ఉప్పుగూడలో గంజాయి చాక్లెట్ల పట్టివేత!

image

ఉప్పుగూడలో గంజాయి చాక్లెట్లను తండైలో కలిపి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన వికాస్ శర్మ (23) ఇటీవలే ఉప్పుగూడకు మకాం మార్చాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ అధికారులు అతని ఇంటిపై దాడిచేసి తనిఖీలు నిర్వహించారు. సుమారు 9.6కిలో గ్రాముల బరువు చేసే 1,920 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు.