News March 19, 2025
జగిత్యాల: 22న పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం

జగిత్యాల జిల్లాలో అక్రమంగా తరలిస్తుండగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యానికి ఈనెల 22న బహిరంగవేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు రూ.3000 టెండర్ ఫీజు, రూ.2 లక్షల ధరావత్ పౌర సరఫరాల అధికారి జగిత్యాల పేరు మీద డీడీ తీసి ఆధార్, పాన్కార్డు ప్రతులను DDతో సహా సమర్పించాలన్నారు. పూర్తివివరాలకు జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Similar News
News December 14, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 43,824 కేసులు పరిష్కారం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ ఆదాలత్లో 43,824 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి తెలిపారు. ఇందులో 38,525 క్రిమినల్ కేసులు ఉండగా 331 సివిల్, 1,313 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయన్నారు. 142 మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లైమ్లను పరిష్కరించి రూ. 9.85 కోట్లు పరిహారంగా చెల్లించడం జరిగిందన్నారు.
News December 14, 2025
బాపట్ల: జిల్లాస్థాయి ఖో..ఖో పురుషుల జట్టు ఎంపిక

పంగులూరు మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల వద్ద ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి ఖో..ఖో పురుషుల జట్టును శనివారం ఎంపిక చేసినట్లు ఖో..ఖో భారత సమాఖ్య ఉపాధ్యక్షుడు సీతారామరెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఈ జట్టు ఈనెల 24, 25, 26 తేదీల్లో కృష్ణాజిల్లా గుడివాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.
News December 14, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 43,824 కేసులు పరిష్కారం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ ఆదాలత్లో 43,824 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి తెలిపారు. ఇందులో 38,525 క్రిమినల్ కేసులు ఉండగా 331 సివిల్, 1,313 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయన్నారు. 142 మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లైమ్లను పరిష్కరించి రూ. 9.85 కోట్లు పరిహారంగా చెల్లించడం జరిగిందన్నారు.


