News August 21, 2025
జగిత్యాల: ‘NCC ద్వారా విద్యార్థులకు దేశభక్తి పెరుగుతుంది’

NCC ద్వారా విద్యార్థులకు దేశభక్తి అలవడుతుందని ఆర్మీ హవల్దార్లు రాకేష్, పి.వి.రావు అన్నారు. గురువారం SKNR ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు శారీరక, భౌతిక సామర్థ్య పరీక్షలు నిర్వహించి పలువురు విద్యార్థులను NCCకి ఎంపిక చేశారు. ప్రిన్సిపల్ అరిగెల అశోక్ మాట్లాడుతూ.. NCC సర్టిఫికెట్ ద్వారా త్రివిధ దళాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు.
Similar News
News April 13, 2026
పతనమైన ఉల్లి ధరలు.. రైతుల కన్నీరు

కొత్తపల్లి మండల పరిధిలో ఉల్లి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉల్లి ధర క్వింటా రూ.300కి పడిపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పంట కోతకు పెట్టే ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోసిన ఉల్లిని అమ్మేందుకు మార్కెట్లో సరైన ధర లేక పెట్టుబడులు కూడా వృథా అవుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
News April 13, 2026
మెదక్: ఈ అమ్మాయిలు GREAT

ఇంటర్ ఫలితాల్లో మెదక్ మైనారిటీ బాలికల కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించి స్టేట్ ర్యాంకులు సైతం కైవసం చేసుకున్నారు. BiPC-1లో హారిక 438/440 సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, MPC-1లో శృతిక, ఆఫహ బేగం ఇద్దరూ 467/470 సాధించి స్టేట్ 2వ, BiPC -1లో శ్రావణి 436/440 సాధించి స్టేట్ 3వ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. MPC-2లో అక్షయ 990/1000 సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
News April 13, 2026
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఈ రైళ్లు రద్దు

వరంగల్ మీదుగా విజయవాడ వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విజయవాడ సమీపంలోని రాయనపాడు యార్డ్ ఆధునీకరణ పనుల కారణంగా ఈనెల 28 నుంచి మే 5 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శాతవాహన, ఇంటర్సిటీ (గుంటూరు-SEC), గోల్కొండ సహా పలు రైళ్లు రద్దు కాగా, విజయవాడ-భద్రాచలం, విజయవాడ- డోర్నకల్ ప్యాసింజర్ రైళ్లు సైతం రద్దయ్యాయని, ప్రయాణికులు విషయాన్ని గమనించాలని కోరింది.


