News March 29, 2025

జగ్గన్నపేటలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క

image

ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఓపెన్ టెక్స్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెనుకబడిన ములుగు జిల్లాలో గిరిజన గ్రామాలను దత్తత తీసుకోవడానికి స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Similar News

News April 1, 2025

చిన్నారికి రూ.5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎంపీ కావ్య

image

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ.5 లక్షల ఎల్ఓసీని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అందజేశారు. అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని కడియం కావ్య అన్నారు. హనుమకొండ రెడ్డి కాలనీకి చెందిన Md. నజీం అహ్మద్ కుమారుడు ఆదిల్ అహ్మద్‌కు వైద్య చికిత్స కోసం అందించామని వరంగల్ ఎంపీ కావ్య తెలిపారు.

News April 1, 2025

నాగర్‌కర్నూల్: ‘అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి’

image

ఊర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఊరుకొండ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో పవిత్రమైన దేవాలయం వద్ద ఇలాంటి చర్యలకు పూనుకోవడం దుర్మార్గమని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

News April 1, 2025

ఎల్ఆర్ఎస్ ద్వారా ఇప్పటివరకు రూ.94 కోట్ల ఆదాయం: మేయర్

image

25 శాతం రిబేట్‌తో ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా సుమారు 14 వేల పాట్లను క్రమబద్దీకరించి ఇప్పటివరకు బల్దియా దాదాపు రూ.94 కోట్ల ఆదాయం సేకరించిందని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల నివృత్తి కౌంటర్‌ను నగర మేయర్ గుండు సుధారాణి సోమవారం ఆకస్మికంగా సందర్శించి ఎల్ఆర్ఎస్‌కు ప్రజల సందేహాలను పరిష్కరిస్తున్న తీరును పరిశీలించారు.

error: Content is protected !!