News February 28, 2025
జగ్గయ్యపేట: చెరువు బజార్లో దారుణ హత్య

జగ్గయ్యపేటలో గురువారం రాత్రి అమావాస్య సందర్భంగా దేవతామూర్తుల ఊరేగింపులో వివాదం చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. పాత కక్షల నేపథ్యంలో శ్రీను (27) అనే వ్యక్తిని ప్రత్యర్థులు పీక కోసి హత్య చేశారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
Similar News
News December 17, 2025
చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి: సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా అధికారులకు CM దిశానిర్దేశం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా ఉంటారని తెలిపారు. మనం ఏం చేశామనే వివరాలు సమగ్రంగా ఉండాలని, నిరంతరం నేర్చుకునే పనిలో ఉండాలని అన్నారు. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా కృషి చేయాలని, జవాబుదారీతనం ఉండాలని పిలుపునిచ్చారు.
News December 17, 2025
రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు!

TG: పంచాయతీ ఎన్నికలు ముగుస్తుండటంతో పరిషత్(MPTC, జడ్పీ) ఎలక్షన్స్కు ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఈ ఫైల్ను అధికారులు సీఎంకు పంపారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. పంచాయతీ తరహాలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. సీఎం ఆమోదిస్తే ఈ నెల 25లోపు షెడ్యూల్ విడుదల, JANలో ఎన్నికలు పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.
News December 17, 2025
మధ్యతరగతికి ‘వెండి’ వెలుగులు

ప్రస్తుతం బంగారం ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీంతో ఈ రోజుల్లో పేద, మధ్యతరగతి వారికి వెండి పెట్టుబడి మంచి అవకాశంగా మారింది. కిలో వెండి ధర ఒక్కరోజే <<18588447>>రూ.11 వేలు పెరిగి<<>> రూ.2,22,000కు చేరి మార్కెట్ను ఆశ్చర్యపరిచింది. రాబోయే రోజుల్లో సిల్వర్ ధరలు మరింత ఎగబాకే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. బంగారంతో పోలిస్తే అందుబాటు ధరలో ఉన్న వెండిని కొనుగోలు చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.


