News February 28, 2025

జగ్గయ్యపేట: చెరువు బజార్లో దారుణ హత్య

image

జగ్గయ్యపేటలో గురువారం రాత్రి అమావాస్య సందర్భంగా దేవతామూర్తుల ఊరేగింపులో వివాదం చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. పాత కక్షల నేపథ్యంలో శ్రీను (27) అనే వ్యక్తిని ప్రత్యర్థులు పీక కోసి హత్య చేశారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. 

Similar News

News October 30, 2025

ప్రెగ్నెన్సీలో అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

image

థైరాయిడ్ పనితీరుకు, శారీరక, మానసిక అభివృద్ధికి అయోడిన్ ఎంతో ముఖ్యం. గర్భిణుల్లో అయోడిన్ లోపం ఉంటే పుట్టే పిల్లల్లో మానసిక, శారీరక అభివృద్ధి ఉండదు. అలాగే గర్భస్రావం, వికలాంగ శిశువు, మరుగుజ్జు, చెవి, కంటి సమస్యలు, నత్తి వంటివి వస్తాయంటున్నారు నిపుణులు. పాలు, పెరుగు, బ్రౌన్ రైస్, చేపలు, ఉప్పు, కాడ్ లివర్ ఆయిల్, మాంసం, గుడ్లు, ఆకుకూరలు, మిల్లెట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News October 30, 2025

శరీరానికి ఎంత అయోడిన్ అవసరమంటే

image

శరీరానికి చాలా తక్కువ పరిమాణంలో అయోడిన్ ఉంటే సరిపోతుంది. రోజుకు కేవలం 150mg తీసుకుంటే చాలు. పిల్లలకు 50mg, గర్భిణులకు 200mg అయోడిన్ సరిపోతుంది. ఒక వ్యక్తి జీవితకాలంలో కేవలం అర టీస్పూన్ అయోడిన్ మాత్రమే అవసరమవుతుంది. మన శరీరంలో 25mg అయోడిన్ ఉంటుంది. కాబట్టి అయోడిన్ అధికంగా ఉండే ఆహారాన్ని శరీరానికి అవసరమైనంత మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అలాగని అతిగా తీసుకున్నా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

News October 30, 2025

KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్

image

IPL: KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్ నియమితులయ్యారు. జట్టుకు గత 3 సీజన్లుగా హెడ్ కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్‌ను ఈ ఏడాది JULYలో తొలగించిన విషయం తెలిసిందే. వారం క్రితమే కోచ్‌ పదవిపై నాయర్‌తో KKR సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. పండిట్‌ శిక్షణలో జట్టు 2024లో విజేతగా నిలిచినప్పుడు నాయర్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్నారు. అటు ఈ ఏడాది మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో UP వారియర్స్‌ జట్టుకు చీఫ్‌ కోచ్‌గా పనిచేశారు.