News March 23, 2025

జడ్చర్ల: చికిత్స పొందుతూ.. యువకుడి మృతి

image

చికిత్స పొందుతూ.. యువకుడు మృతి చెందిన సంఘటన జడ్చర్ల పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణానికి చెందిన రవీంద్ర (26) శుక్రవారం కుటుంబ సభ్యులతో భూతగాదాలతో గొడవ పడి పారాసెటమాల్ మాత్రలను వేసుకున్నాడు. అనంతరం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. శనివారం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో రవీంద్ర మరణించాడని, సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఇజాజొద్దీన్ తెలిపారు.

Similar News

News January 2, 2026

MBNR: TG TET.. బందోబస్తు ఏర్పాటు: SP

image

MBNR జిల్లాలో TG TET దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP డి.జానకి తెలిపారు. పరీక్ష రోజుల్లో ఉదయం 7:30 నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News January 2, 2026

మహబూబ్‌నగర్: నేటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు: SP

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాడుటకు, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ దృష్ట్యా ఇవాళ ఉదయం నుంచి జనవరి 31 సాయంత్రం 6 గంటల వరకు భారత పోలీస్ చట్టంలోని 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి వెల్లడించారు. ఐదుగురికి మించి గుంపులుగా కూడరాదని, ఆయుధాలు, కర్రలు, రాళ్లు, ఇతర ప్రమాదకర వస్తువులతో తిరగరాదని, అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించరాదన్నారు.
SHARE IT

News January 2, 2026

MBNR: ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్.. అప్లై చేసుకోండి

image

మహబూబ్ నగర్ జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు 100% సబ్సిడితో ఆర్ధిక పునరావాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిణి యస్.జరీనా బేగం తెలిపారు. అర్హులైన ముగ్గురు(3) ట్రాన్స్ జెండర్స్ కు ఒక్కొకరికి రూ.75వేల చొప్పున మొత్తం 1 యూనిట్‌కు రూ.75 వేలు 100% సబ్సిడీ మీద జిల్లాకు కేటాయించడం జరిగిందని, ఈనెల 9లోగా దరఖాస్తును కార్యాలయంలో సమర్పించారన్నారు.