News January 31, 2025

జడ్చర్ల: చెట్టుపై నుంచి కిందపడి యువకుడి మృతి 

image

జడ్చర్ల మండలం మూల స్తంభం తండాకు చెందిన రాథోడ్ తరుణ్ నాయక్ (29) పొట్టకూటి కోసం కుటుంబంతో కలిసి తాండూర్‌కు వలస వెళ్లాడు. అడ్డా కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం పోస్ట్ ఆఫీస్‌లోని చెట్లను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 24, 2025

MBNR: ‘భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలి’

image

జిల్లాలో భూగర్భ జిల్లాలో అడుగంటకుండా వాటిని పెంచేందుకు వర్షపు నీటి సంరక్ష నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో నీటి నియంత్రణపై ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీలో పలు సూచనలు చేశారు. నీటి సంరక్షణ పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు అందరికీ అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు.

News April 24, 2025

మిడ్జిల్: వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

మిడ్జిల్ మండల్ మల్లాపూర్‌లో నేడు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి వడ్ల తేమ శాతం చూశారు. రైతులతో మాట్లాడుతూ.. సన్నాళ్లకు బోనస్ అందుతున్నాయా అని, తేమ శాతం వచ్చే విధంగా ఆరబెట్టాలని, రైతులకు కల్లాలకు స్థల పరిశీలన, సరిపడా టార్పాలిన్ ఇవ్వాలని స్థానిక ఎమ్మార్వో, ఏపీఎంకి సూచించారు.

News April 24, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔ఉగ్రవాద దుశ్చర్యలను ఖండించిన ఏబీవీపీ
✔NGKL: 60 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
✔కొల్లాపూర్‌లో BRS నాయకుడిపై దాడి
✔ఈత సరదా విషాదం కాకూడదు:SPలు
✔భూభారతి చట్టంపై రైతులకు అవగాహన
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✔వనపర్తి:Way2Newsతో జిహెచ్ఎం ఉమాదేవి
✔కొనసాగుతున్న ఓపెన్ SSC,INTER పరీక్షలు
✔వేసవిలో జాగ్రత్త…’Way2news’తో ఉపాధ్యాయులు
✔ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ.. విద్యార్థుల సందడి

error: Content is protected !!