News October 9, 2025

జడ్చర్ల: భవిత కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

image

ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని కలెక్టర్ విజయేందిర బోయి గురువారం తనిఖీ చేశారు. భవిత కేంద్రంలో పిల్లలకు అందిస్తోన్న ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ విధానాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న టాయిలెట్‌ను పరిశీలించారు. టాయిలెట్‌లోకి వెళ్లేందుకు భవనం నుంచి దారి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మంజుల పాల్గొన్నారు.

Similar News

News October 10, 2025

మహబూబ్‌నగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

image

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని చౌదర్‌పల్లి శివారులో నేషనల్ హైవే 167పై ఈనెల ఆరో తేదీన గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి గాయపడ్డాడు. అతడిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నేడు మృతిచెందినట్లు రూరల్ ఎస్ఐ విజయ్ వెల్లడించారు. మృతుడు వయసు 45 సంవత్సరాలు ఉంటుందని, మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచామని, వివరాలకు 8712659336 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News October 9, 2025

పాలమూరు: ‘ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు సమాజ సేవకు అంకితం అవ్వాలి’

image

ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు సమాజ సేవకు అంకితం అవ్వాలని పాలమూరు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీలో ఏడు రోజుల క్యాంపును నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మూఢనమ్మకాలు, బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించాలని కోరారు.

News October 9, 2025

MBNR: ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిషత్ కార్యాలయంలో కొడుగల్ గ్రామపంచాయతీ కార్యాలయం క్లస్టర్‌లో ఎంపీటీసీ నామినేషన్ స్వీకరణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఎన్నికల సజావు నిర్వహణ, భద్రత, ఉద్యోగుల సంఖ్య, మౌలిక వసతులు సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.