News October 24, 2024
జడ్చర్ల: మద్యం లోడ్ కంటైనర్ బోల్తా.. ఎగబడ్డ జనం

మద్యం లోడ్తో వెళ్తున్న కంటైనర్ బోల్తా పడటంతో జనం ఎగబడ్డారు. పెబ్బేరు నుంచి హైదరాబాద్కు మద్యం లోడుతో వెళ్తున్న కంటైనర్ జడ్చర్లలో హైవే- 44పై జంజం హోటల్ వద్ద ఆగి ఉండగా మరో లారీ ఢీకొట్టింది. దీంతో కంటైనర్ బోల్తా పడటంతో అందులో ఉన్న మద్యం బాటిళ్లు చెల్లాచెదురయ్యాయి. హైవేపై ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మందు బాటిళ్ల కోసం ఎగబడ్డ స్థానికులను చెదరగొట్టారు.
Similar News
News December 21, 2025
MBNR: సైబర్ మోసం జరిగితే ‘మొదటి గంట’ కీలకం: ఎస్పీ

సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బు కోల్పోతే.. బాధితులు మొదటి గంటలో (గోల్డెన్ అవర్) ఫిర్యాదు చేయడం అత్యంత కీలకమని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు. త్వరగా స్పందిస్తే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సైబర్ కేసుల విచారణలో ప్రతిభ చాటిన జిల్లా D4C సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
News December 21, 2025
MBNR: లోక్ అదాలత్.. రూ.16,96,579 రికవరీ

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో సైబర్ నేరాల బాధితులకు గణనీయమైన ఉపశమనం లభించింది. జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సైబర్ క్రైమ్ కేసుల్లో మొత్తం రూ.16,96,579 రికవరీకి సంబంధించి 77 కేసులు పరిష్కరించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా సైబర్ నేరాల బాధితులకు త్వరిత న్యాయం లభించడం ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.
News December 21, 2025
MBNR: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల నిఘా: ఎస్పీ

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో MBNR జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు క్షేత్రస్థాయిలో నిఘా పెంచినట్లు పేర్కొన్నారు. “వేడుకలు జరుపుకోవడం అందరి హక్కే.. కానీ ఆ ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు” అని ఆమె స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


