News March 18, 2024
జనగాం: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దూల్మిట్ట మండలంలో జరిగింది. మద్దూరు ఎస్సై షేక్ యూనస్ అహ్మద్ అలీ తెలిపిన వివరిలిలా.. కూటిగల్ గ్రామానికి చెందిన తిగుళ్ల రమేశ్ (21) జీవితంపై విరక్తి చెంది వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆయన తెలిపారు.
Similar News
News July 1, 2024
వరంగల్: ఈరోజు పత్తి ధర రూ.7,160
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పునఃప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్కు పత్తి తరలిరాగా.. ధర మాత్రం గత వారంలాగే రూ.7,160 పలికింది. పత్తి ధర పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. కాగా, మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంన్నది.
News July 1, 2024
MHBD: ఓ వ్యక్తి వేధింపులు.. భార్య మృతి, భర్త సీరియస్
ఓ వ్యక్తి వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన MHBD జిల్లా నెల్లికుదురు మం.లో ఆదివారం జరిగింది. SI క్రాంతికిరణ్ ప్రకారం.. పెద్దతండాకు చెందిన నీలమ్మను అదే గ్రామానికి చెందిన వీరన్న అనే వ్యక్తి తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. నీలమ్మ భర్త భద్రు అవమానానికి గురై పురుగు మందు తాగగా.. నీలమ్మ సైతం ఆత్మహత్యకు పాల్పడింది. నీలమ్మ మృతి చెందగా.. భద్రు చికిత్స పొందుతున్నాడు.
News July 1, 2024
వరంగల్ కాంగ్రెస్లో కలహాలు?
ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల మధ్య కలహాలు పెరిగాయనే విమర్శలొస్తున్నాయి. శనివారం CM రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కనీస సమాచారం లేదని పలువురు ముఖ్యనాయకులు వాపోయారు. ఇదిలా ఉండగా CM పర్యటనలో NSPT MLA దొంతి మాధవరెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. పరకాల నియోజకవర్గంలో సైతం ఫ్లెక్సీలు, ఇతర అంశాలపై వాగ్వాదాలు జరుగుతుండగా.. వర్ధన్నపేటలో నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.