News October 29, 2025
జనగామలో నవంబర్ 1 నుంచి శాతవాహన ట్రైన్ హాల్టింగ్

నవంబర్ 1 నుంచి జనగామలో శాతవాహన ట్రైన్కు హాల్టింగ్ ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు దశమంత్ రెడ్డి తెలిపారు. జనగామలో శాతవాహన ట్రైన్కు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవను కోరగా జనగామలో శాతవాహనకు హాల్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News October 29, 2025
బిహార్ అభ్యర్థుల్లో 32% మందిపై క్రిమినల్ కేసులు

బిహార్ ఫేజ్1 ఎన్నికలు జరిగే 121 అసెంబ్లీ స్థానాల్లో 1314 మంది పోటీలో ఉన్నారు. అఫిడవిట్లు ఇచ్చిన 1303 అభ్యర్థుల్లో 423(32%) మందిపై క్రిమినల్ కేసులున్నట్లు ADR పేర్కొంది. వీరిపై 33 మర్డర్, 86 అటెంప్ట్ టు మర్డర్, 46 రేప్ వంటి కేసులు నమోదయ్యాయి. పార్టీల వారీగా చూస్తే RJD 53, CONG 15, BJP 31, JDU 22, LJP 7 మంది క్రిమినల్ కేసులున్న వారే. ఇక లెఫ్ట్ పార్టీల అభ్యర్థుల్లో 30 మందిపై అలాంటి కేసులే ఉన్నాయి.
News October 29, 2025
అస్థిర స్థలంలో ఇల్లు వద్దు: వాస్తు నిపుణులు

కొండలు, గుట్టల అంచులలో ఇల్లు కట్టుకోవడం శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇలాంటి ప్రదేశాలలో నిర్మించే ఇళ్లు స్థిరంగా ఉండవు. కొండ అంచులు బలహీనమయ్యే అవకాశాలుంటాయి. భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో భూమి జారే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల నివాసానికి హాని కలుగుతుంది. ఇక్కడ ప్రాణశక్తి ప్రవాహం కూడా సరిగా ఉండదు. సురక్షిత జీవనం కోసం ఇలాంటి ప్రదేశాలను నివారించాలి’ అని అన్నారు. <<-se>>#Vasthu<<>>
News October 29, 2025
మరింత కష్టపడి మీ నోరు మూయిస్తా: అభిషేక్

అవార్డు కొనుక్కున్నానంటూ వచ్చిన కామెంట్లపై నటుడు అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో స్పందించారు. ‘అవార్డుకోసం పీఆర్ మేనేజ్ చేయలేదు. కష్టంతో కన్నీళ్లు ఒలికించి, రక్తం చిందించి సాధించాను. మీరు ఇకపైనా నమ్ముతారనుకోను. అందుకే మరో విజయం కోసం మరింత కష్టపడి మీ నోరు మూయిస్తా’ అని Xలో ఆయన పేర్కొన్నారు. కాగా ‘ఐ వాంట్ టు టాక్’ మూవీలో ఆయన నటనకు ఫిలింఫేర్-2025 అవార్డు దక్కగా దాన్ని కొన్నారని SMలో విమర్శలొచ్చాయి.


