News July 9, 2025
జనగామ: ఇది.. మా ఇంటి ఇంకుడు గుంత: కలెక్టర్

భూగర్భ జలాలను వృద్ధి చేయాలనే లక్ష్యంతో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జిల్లాలో ”మన జిల్లా- మన నీరు ” కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ తన ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను నిర్మించుకున్నారు. ఈ చక్కటి కార్యక్రమంలో కలెక్టరే పలుగు, పార పట్టి ఇంకుడు గుంతను తవ్వారు. బాధ్యతతో మా ఇంట్లో ఇంకుడుగుంతను నిర్మించా.. మీరు సైతం మీ ఇళ్లల్లో ఇంకుడుగుంతను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
Similar News
News July 9, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిన సార్వత్రిక సమ్మె
> ఆకట్టుకున్న బాంజీపేట ప్రభుత్వ పాఠశాల
> జనగామ డీటీఓగా హుస్సేన్ బాధ్యతల స్వీకరణ
> రఘునాథపల్లి: రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
> పాలకుర్తి ఎంపీడీవోగా రవీందర్ బాధ్యతల స్వీకరణ
> ఇప్పగూడెం జడ్పీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
> బతుకమ్మ కుంట నెల రోజులు మూసివేత
> జనగామ ఎమ్మెల్యేను పరామర్శించిన ఎంపీ
News July 9, 2025
మైనింగ్ బ్లాక్పై ఫిర్యాదులు.. స్పందించిన పవన్

AP: విజయనగరంలో దేవాడ మైనింగ్ బ్లాక్ విషయంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా మాంగనీస్ తవ్వకాలు జరుపుతున్నట్లు ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభ్యంతరాలను పరిగణించలేదని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీంతో ఆ జిల్లా అధికారులతో పవన్ చర్చించారు. మైనింగ్కు సంబంధించి పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
News July 9, 2025
నల్గొండ: ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య

కనగల్కి చెందిన కౌలు రైతు గోనెల చిన్న యాదయ్య (45) ఆర్థిక ఇబ్బందులు తాళలేక బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ ఎస్.రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యాదయ్య తనకున్న కొద్దిపాటి భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగులో నష్టాలు రావటంతో ఇవాళ మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదయ్య మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.