News February 19, 2025
జనగామ: ఉపాధ్యాయుడిగా మారిన అదనపు కలెక్టర్

జనగామ జిల్లా కేంద్రంలోని శామీర్ పేటలో గల టీజీఎంఆర్ఈఐఎస్ బాలుర వసతి గృహాన్ని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) పింకేశ్ కుమార్ సందర్శించి వసతి గృహంలో వసతి సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 6, 2025
NZB: కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయండి: DRDO

జిల్లాల్లో కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని NZB DRDO సాయాగౌడ్ ఆదేశించారు. గురువారం NZB కలెక్టరేట్లో NZB, KMR, ADB, MDK, నిర్మల్ జిల్లాల DPM, DAPMలకు హెల్త్ అండ్ న్యూట్రీషియన్, బాలికల సంఘాల ఏర్పాటు అంశాల్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడారు.. కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేసి వారికి మండల, గ్రామ స్థాయిలో అంగన్వాడీ టీచర్స్, ANMలతో సమన్వయం చేయాలని సూచించారు.
News November 6, 2025
ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్లో నమోదు చేయాలి: NZB కలెక్టర్

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలను యూడైస్లో నమోదు చేయాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం విద్యా శాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపల్స్, HMలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రయోజనార్థం ప్రభుత్వం వారి వివరాలను యూడైస్లో నిక్షిప్తం చేయిస్తోందన్నారు.
News November 6, 2025
రేపు ‘వందేమాతరం’ సామూహిక గీతాలాపన: NZB కలెక్టర్

వందేమాతరం జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని శుక్రవారం సామూహిక గీతాలాపన ఉంటుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. వందేమాతరం గీతానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్న వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని విధిగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆలపించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


