News October 20, 2025
జనగామ: ఎఫ్ఆర్ఎస్తో మెరుగైన హాజరు శాతం

జనగామ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అమలు చేస్తున్న ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నిషన్ సిస్టం) ద్వారా విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడింది. గతంలో విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ మెమోలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల తీసుకొచ్చిన ఎఫ్ఆర్ఎస్ విధానం వల్ల గతంతో పోలిస్తే విద్యార్థుల హాజరు శాతం చాలా మెరుగు పడింది.
Similar News
News October 20, 2025
హనుమకొండ: 11 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

హనుమకొండ సుబేదారి ప్రాంతంలోని శ్రీనివాస కాలనీలో ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి పేకాడుతున్న 11 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. నిందితుల నుంచి రూ.1.23 లక్షల నగదు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
News October 20, 2025
MBNR: పేదల తిరుపతిగా కురుమూర్తి 2/2

పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయి. తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రతిరూపమే ఇక్కడి స్వామివారని భక్తుల నమ్మకం. పాలమూరు జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ఉత్సవమే ప్రధాన ఘట్టం. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.
News October 20, 2025
MBNR: పేదల తిరుపతిగా కురుమూర్తి 1/2

మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట (M) కురుమూర్తిలో ఉన్న దేవాలయం ఉమ్మడి జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి. కాంచనగుహగా పేరొందిన కురుమూర్తి కొండలలోని వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు దర్శించుకుంటారు. సా.శ.1268 కాలంలో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. Way2News ప్రత్యేక కథనం.