News December 19, 2025

జనగామ: కరెన్సీనోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని వినతి

image

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని జనగామకు చెందిన కరెన్సీపై అంబేడ్క‌ర్ పొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురాములు ఎంపీ సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పరుశురాములు మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Similar News

News December 21, 2025

జాగ్రత్త.. వణికించేస్తున్న చలి

image

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. నిన్న తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ ఉ.8.30 గంటల వరకు బయటకు రావొద్దని IMD 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు APలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో నిన్న కనిష్ఠ ఉష్ణోగ్రత 4.7 డిగ్రీలుగా నమోదైంది. అరకులో 5.8, పాడేరులో 6.7, డుంబ్రిగుడలో 9.1గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 21, 2025

పుష్య మాసంలో పర్వదినాలు

image

DEC 29: కపిలేశ్వర స్వామి తెప్పోత్సవం. 30: ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం. 31: కూర్మ ద్వాదశి, శ్రీవారి చక్రస్నానం. JAN 1: ప్రదోష వ్రతం. 3: శాకాంబరీ పౌర్ణమి. 4: శ్రీవారి సన్నిధిలో ప్రణయ కలహ మహోత్సవం. 6: సంకటహర చతుర్థి. 11: ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం. 14: మతత్రయ ఏకాదశి, భోగి. 15: మకర సంక్రాంతి. 16: కనుమ. 17: ముక్కనుమ, మాస శివరాత్రి, ప్రదోష వ్రతం, సావిత్రి గౌరీ వ్రతం. 18: చొల్లంగి అమావాస్య.

News December 21, 2025

ఓటర్లు తీర్పు ఇచ్చారు.. అప్పులు గుండెల్లో గునపాలు దించాయి!

image

కామారెడ్డి జిల్లాలో జీపీ ఎన్నికల ఫలితాలు పల్లెల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గెలిచిన వారు సంబరాల్లో మునిగిపోగా, ఓడిపోయిన అభ్యర్థుల పరిస్థితి “ముందు నుయ్యి వెనుక గొయ్యి”లా మారింది. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో శక్తికి మించి ఖర్చు చేసిన అభ్యర్థులు, ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో ఎవరిని కదిలించినా “పైసలు పాయె.. పదవి రాకపాయె” అనే చర్చ సాగుతోంది.