News October 30, 2025

జనగామ కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లకు కంట్రోల్ రూమ్

image

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలను పరిష్కరించడానికి జనగామ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ రిజ్వాన్ బాషా రిబ్బన్ కట్ చేసి కంట్రోల్ రూమ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో ఎలాంటి సమస్యలు ఉన్నా 8520991823ను సంప్రదించాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News October 31, 2025

జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. నేటి వరకు జిల్లాలో 10 సోయాబీన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించడంతోపాటు, ఈరోజు వరకు మొత్తం 29,100 క్వింటాళ్ల మొక్కజొన్న పంటను కొన్నామన్నారు.

News October 31, 2025

దస్తూరాబాద్: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన దస్తూరాబాద్ మండలంలోని రేవోజిపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రేవోజిపేట గ్రామంలోని కొత్త పల్లెలోని ముప్పిడి రాధ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.

News October 31, 2025

నిర్మల్: రేపు జిల్లా వ్యాప్తంగా 2కే రన్ కార్యక్రమం

image

శుక్రవారం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో ఏక్తా దివస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులందరూ 2కే రన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు, పలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 2కే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు, యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.