News April 3, 2025

జనగామ: కలెక్టర్‌ను కలిసిన జిల్లా ఆర్టీఏ నెంబర్

image

జనగామకి చెందిన చిలువేరి అభి గౌడ్ జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్‌గా నియమితులైన సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, డీసీపీ మహేంద్ర నాయక్, సీఐ దామోదర్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం తరఫున, రవాణా శాఖకు సంబంధించి అన్ని రకాలుగా అవగాహన కల్పించడంతో పాటు అందరూ బాధ్యతాయుతంగా ఉండేలా చేసుకోవాలని అధికారులు వారికి సూచించారు.

Similar News

News November 2, 2025

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి: కలెక్టర్ ఇలా

image

వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ రోజు ఆమె తిప్పర్తి(M) చిన్న సూరారం గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

News November 2, 2025

తిరుపతి జూలో వరుస మరణాలు

image

తిరుపతి జూలో జంతువుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల పులులు, చిరుతలు, <<18162099>>వాలబీ <<>>వంటి అరుదైన జంతువులు చనిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చినవి అనారోగ్యం, వృద్ధాప్యంతో చనిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని జంతు ప్రేమికులు అంటున్నారు. జూ అధికారులు మరింత జాగ్రత్తగా జంతువులు అనారోగ్యానికి గురికాకుండా కాపాడాలని కోరుతున్నారు.

News November 2, 2025

మద్యం దుకాణాల కోసం ‘బేరసారాలు షురూ..

image

మద్యం టెండర్లలో దుకాణాలు దక్కని వ్యాపారులు మనోవేదనకు గురవుతూ.. డ్రాలో మద్యం దుకాణాలు గెలిచినవారితో బేరసారాలు మొదలుపెట్టారు. ఆసిఫాబాద్ జిల్లాలో 25 దుకాణాలకు డ్రా జరగగా, షాపులు రానివారు ‘ఎంతైనా ఇస్తాం’ అంటూ ఆశ చూపించి దుకాణాలను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విజేతలతో ఎంతమంది భాగస్వాములున్నారు.. గుడ్విల్ కింద ఇచ్చే అవకాశం ఉందా…? అని ఆరా తీస్తున్నట్లు తెలిసింది.