News August 16, 2025
జనగామ జిల్లాలోని స్వాతంత్ర్య సమరయోధులు వీరే..!

స్వాతంత్ర్య సంగ్రామంలో జనగామ ప్రాంతం నుంచి పోరాటం చేసి తమ ప్రాణాలను సైతం అర్పించారు. వారు వివరాలు ఎస్.వీరయ్య(నిడిగొండ), సతరాసి నర్సయ్య(రఘునాథపల్లి), కంచనపల్లి నుంచి పాముకుంట్ల ఆయిలయ్య, కె.కృష్ణాజి, ముత్తిడి బుచ్చిరెడ్డి(జనగామ), కోరింగుల నారాయణరెడ్డి(గానుగపహాడ్), కె.జగన్నాథ్ రెడ్డి(గూడూరు), కళ్లెం నుంచి ఏలే వీరయ్య, ఏలే నారాయణలతో పాటు ఇతర గ్రామాల నుంచి రాగి నర్సింలు, జి.మోహన్ రెడ్డి ఉన్నారు.
Similar News
News August 16, 2025
సర్పంచ్ సాబ్లు వచ్చేదెప్పుడో.. బిల్లులు పడేదెప్పుడో?

TG: బిల్లులు పేరుకుపోవడంతో గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావొస్తోంది. కొత్త సర్పంచులు వచ్చాకే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు నిధులు విడుదల అవుతాయి. దీంతో కాంట్రాక్టర్లు గ్రామాలకు శానిటరీ, ఇతర సామగ్రి పంపిణీ చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే రూ.కోట్లలో బిల్లులు రావాల్సి ఉందంటున్నారు. అటు BC రిజర్వేషన్లతో ‘స్థానిక ఎన్నికలు’ ఆలస్యం అవుతున్నాయి.
News August 16, 2025
హన్మకొండలో కనువిందు చేసిన బ్రహ్మాకమలాలు

హిమాలయాల్లో కనిపించే అరుదైన బ్రహ్మకమలాలు హన్మకొండలో కనువిందు చేశాయి. రెడ్డికాలనీకి చెందిన ప్రసాదరావు-సాగరిక దంపతుల ఇంట్లో ఈ అరుదైన పుష్పాలు వికసించాయి. నాలుగేళ్ల క్రితం మొక్కను తీసుకొచ్చి నాటారు. శుక్రవారం రాత్రి తొలిసారిగా వికసించాయి. దీంతో చుట్టుపక్కల వారు తరలివచ్చి పుష్పాలను వీక్షిస్తున్నారు. ఇది మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన పుష్పం.
News August 16, 2025
విశాఖ ప్రజలకు జీవీఎంసీ కమిషనర్ విజ్ఞప్తి

విశాఖ నగరంలో భారీ వర్షాలు ఉన్నందున ఇప్పటికే జీవీఎంసీ అప్రమత్తంతో ప్రత్యేక చర్యలను చేపట్టిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం తెలిపారు. ప్రజలు ఇళ్లలో విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వాడాలని, శిథిలావస్థ భవనాల్లో ఉండరాదని కమిషనర్ సూచించారు. ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే జీవీఎంసీ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 4250 0009కు సమాచారం అందించాలని కోరారు.