News February 23, 2026
జనగామ జిల్లాలో క్షుద్రపూజల కలకలం

పాలకుర్తి మండలంలోని గుడికంటతండాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. సర్పంచ్ మహేందర్ ఇంటి ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి పూజలు నిర్వహించారు. ఇంటి ముందు కోడిగుడ్లు, మిరపకాయలు, నిమ్మకాయలతో భీతిగొల్పేలా ముగ్గులు వేయడంతో సర్పంచ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News February 27, 2026
సూసైడ్ గురించి సెర్చ్ చేస్తే పేరెంట్స్కు అలర్ట్

పిల్లలు సూసైడ్ లేదా సెల్ఫ్-హార్మ్ వంటి పదాలతో ఇన్స్టాలో సెర్చ్ చేస్తే.. వెంటనే పేరెంట్స్కు అలర్ట్ వెళ్లేలా కొత్త ఫీచర్ వచ్చింది. పేరెంట్స్ సూపర్విజన్ టూల్స్ వాడుతున్న వారికి ఈ నోటిఫికేషన్లు వాట్సాప్ లేదా SMS రూపంలో వెళ్తాయి. ప్రస్తుతం US, UK వంటి దేశాల్లో మొదలైన ఈ ఫీచర్ 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. పిల్లలను కౌన్సెల్ చేసేలా నిపుణుల సలహాలనూ ఇన్స్టా అందిస్తుంది.
News February 27, 2026
బాన్సువాడ: దొంగల మూఠా అరెస్ట్

విద్యుత్ ట్రాన్స్ఫార్మల నుంచి కాపర్, ఆయిల్ చోరికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాల ప్రకారం.. పలు గ్రామాల్లో దుండగులు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్, ఆయిల్ చోరికి పాల్పడుతున్నారు. దర్యాప్తు చేపట్టి నిందితులు సుభాష్, కరీం, సురేఖఅర్జున్ తాంబే, సునీల్ శ్యామ్ రావు వాగ్మారేను గురువారం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
News February 27, 2026
పాక్-అఫ్గాన్ బార్డర్లో యుద్ధ వాతావరణం

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ ఇటీవల జరిపిన<<19206132>> వైమానిక దాడులకు<<>> ప్రతీకారంగా తాలిబన్లు భారీ ఆపరేషన్ మొదలెట్టారు. డురాండ్ లైన్ వెంట పాక్కు చెందిన 15 చెక్పోస్టులను అధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్ ప్రకటించింది. ఈ దాడుల్లో 40 మంది పాక్ సైనికులు చనిపోయారని మరికొందరిని బంధించామని తెలిపింది. అటు పాక్ కూడా దీటుగా బదులిస్తున్నామని, పలువురు తాలిబన్లను చంపామని అంటోంది.


