News February 28, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ: జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికలు > పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో రథోత్సవం > సాగునీటి కోసం కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా > మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎస్ఐ > కాంగ్రెస్ వస్తే కష్టాలు కామన్ ఎర్రబెల్లి దయాకర్ రావు > జిల్లాలోని పలు ఆలయాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు > జిల్లా వ్యాప్తంగా 94.39% పోలింగ్ నమోదు
Similar News
News December 24, 2025
MDK: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం, అహింసా శాంతి మార్గాన్ని యేసు క్రీస్తు మానవ సమాజానికి చూపించారని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో క్రిస్టియన్ మైనారిటీలకు దేశానికే ఆదర్శంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు.
News December 24, 2025
మెదక్: చర్చిల ఫీస్ట్ వేడుకలకు నిధులు మంజూరు

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని చర్చిల్లో ఫీస్ట్ సెలబ్రేషన్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.34 లక్షలు మంజూరు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షలు కేటాయించగా, రెండు నియోజకవర్గాల్లోని 100 చర్చిలకు ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున రూ.30 లక్షలు మంజూరు చేసిందన్నారు.
News December 24, 2025
చట్టాల గురించి తెలుసుకోండి: చిత్తూరు ఎస్పీ

చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఎస్సీటీ పీసీలకు జరుగుతున్న శిక్షణను ఎస్పీ తుషార్ డూడీ బుధవారం పరిశీలించారు. వారి శిక్షణ అభిప్రాయాలను తెలుసుకున్నారు. సిలబస్ అమలుపై అధికారులకు సూచనలు ఇచ్చారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.


