News March 17, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామ: విజయవంతంగా కొనసాగిన సీఎం పర్యటన > దేవరుప్పుల: తాడి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి > జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతి > సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు > సీఎం పర్యటన పలువురు నేతల ముందస్తు అరెస్ట్ > తూతూ మంత్రంగానే సీఎం పర్యటన ఉంది: తాటికొండ రాజయ్య > అక్రమ అరెస్టులను ఖండించిన సిపిఎం నేతలు > జిల్లా అధికారులను అభినందించిన కలెక్టర్

Similar News

News March 17, 2025

పెళ్లైన మగవారు బరువు ఎందుకు పెరుగుతారంటే?

image

వివాహం తర్వాత పురుషులు అనూహ్యంగా బరువు పెరుగుతుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పెళ్లైన ఆనందంలో పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లి కొంచెం ఎక్కువగా ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఈ సమస్య వస్తుంది. బాధ్యతలు పెరిగి జిమ్‌కు వెళ్లే సమయం ఉండదు కాబట్టి బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరిగిపోతారు. హార్మోన్ల మార్పుల వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి మరో కారణం.

News March 17, 2025

రూ.400కోట్లు పన్నులు చెల్లించాం: శ్రీరామ జన్మభూమి ట్రస్ట్

image

మహాకుంభమేళా సమయంలో కోటి 26లక్షల మంది భక్తులు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. గత ఐదేళ్లలో రూ. 400కోట్ల పన్నులు ప్రభుత్వానికి చెల్లించినట్లు కార్యదర్శి వెల్లడించారు. అయోధ్యకు వచ్చే భక్తులు, పర్యాటకులు సంఖ్య 10రెట్లు పెరిగిందని, స్థానికుల ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. గతేడాది 5కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు.

News March 17, 2025

సంగారెడ్డి: సైబర్ మోసగాళ్ల వలలో పడొద్దు: ఎస్పీ

image

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్‌లకు అలవాటు పడి, సైబర్ మోసగాళ్లు పన్నిన ఉచ్చులో పడవద్దని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ హెచ్చరించారు. యువత డబ్బులు కోల్పోయి అప్పులపాలై, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అక్రమ బెట్టింగ్ యాప్‌లలో బెట్టింగ్‌లకు పాల్పడినా ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సహించిన వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవన్నారు.

error: Content is protected !!