News January 27, 2025
జనగామ జిల్లాలో రైతులకు రూ.15.91 కోట్లు జమ

జనవరి 26న రైతుభరోసా పథకం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రూ.6 వేలు చొప్పున అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు జనగామ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. సోమవారం ఈ మేరకు రైతు భరోసా నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున జనగామ జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,320 రైతులకు రూ.15.91 కోట్లు జైనట్లు తెలిపారు.
Similar News
News September 17, 2025
ఉమ్మడి విశాఖలో 9మందికి ఎంపీడీవోగా పదోన్నతలు

ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేస్తున్న 9 మంది ఏవో, ఈవో (EO PR&RD)లకు ఎంపీడీవోలుగా పదోన్నతి పొందారని జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. వారికి నియామక ఉత్తర్వులను జడ్పీ ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అందజేశారు. పదోన్నతి పొందిన వారు జి.కె. వీధి, బుచ్చయ్యపేట, రావికమతం, కశింకోట, కోటవురట్ల, నాతవరం, ఎస్.రాయవరం, పాయకరావుపేట, ముంచింగిపుట్టు మండలాలకు ఎంపీడీవోలుగా వెళ్లనున్నారు.
News September 17, 2025
భీమారం: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. భీమారం మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి సుధాకర్తో కలిసి రైతులతో మాట్లాడారు. మండలంలో గత సంవత్సరం 14 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించబడిందని, ఈ సంవత్సరం ఇప్పటికే 11 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, వ్యవసాయ సాగుకు అవసరం మేర యూరియా అందిస్తామన్నారు.
News September 17, 2025
నేటి నుంచి మహిళకు ఉచిత వైద్య పరీక్షలు: అనకాపల్లి జేసీ

మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందని అనకాపల్లి జేసీ ఎం.జాహ్నవి అన్నారు. ఈ పథకానికి సంబంధించి గోడ పత్రికను జాయింట్ కలెక్టరు కార్యాలయ ఛాంబర్ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లాలోని 46 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో నేటి నుంచి అక్టోబర్ 2 వరకు మహిళలకు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేసి అవసరమైన వైద్య సహకారాన్ని అందిస్తామన్నారు.