News March 27, 2024
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఏడేళ్ల బాలుడి మృతి
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పెంబర్తి వద్ద ఆటోను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు ఈశ్వర్ మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Similar News
News July 8, 2024
ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్గా ప్రకాష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్గా భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ముఖ్య నేతలకు ప్రకాష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ కార్పొరేషన్ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకాశ్ రెడ్డి చెప్పారు.
News July 8, 2024
ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ ఛైర్మన్గా రాఘవరెడ్డి
తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్గా జంగా రాఘవరెడ్డి నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ బలోపేతానికి కృషి చేస్తానని రాఘవరెడ్డి చెప్పారు. నూతన కార్పొరేషన్ ఛైర్మన్ను పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
News July 8, 2024
రాజన్న నీవు దూరమైన నీ సాహసం చెరగని సంతకం: మంత్రి కొండా
రాజన్న నీవు దూరమైనా.. నీ సాహసం చెరగని సంతకం, నీ ప్రస్థానం మరువని జ్ఞాపకం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని, ప్రతి తెలుగు వాడి గుండెల్లో రాజశేఖర్ రెడ్డి నిలిచిపోయారని మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు.