News February 1, 2025

జనగామ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి పోటాపోటీ!

image

జనగామ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి పార్టీ శ్రేణులు పోటీ పడుతున్నారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డితో పాటు మాజీ అధ్యక్షుడు కేవీఎల్ఎన్ రెడ్డి, ఊడుగుల రమేశ్, సౌడ రమేశ్, బెజాడీ బీరప్ప, విద్యాసాగర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈసారి బీసీ లేదా ఎస్సీలకు ఇవ్వాలని అధిష్ఠానం యోచిస్తోంది. ఎవరికి ఇస్తారనేది నాయకుల్లో ఉత్కంఠగా నెలకొంది.

Similar News

News November 3, 2025

SRCL: పెద్దింటి అశోక్‌ కుమార్‌కు జీవన సాఫల్య పురస్కారం

image

సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సినీ గేయ రచయిత అయిన పెద్దింటి అశోక్‌ కుమార్‌కు ‘అమృత లత జీవన సాఫల్య పురస్కారం-2025’ లభించింది. నిజామాబాద్‌లోని అపురూప అవార్డు బృందం వారు ఆదివారం ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ఆయన సాహిత్యంపై ఇప్పటివరకు వివిధ యూనివర్సిటీల నుంచి ఐదు ఎంఫిల్, నాలుగు పీహెచ్‌డీ పట్టాలు రావడం విశేషం.

News November 3, 2025

సీఏ ఫలితాలు విడుదల

image

సీఏ(ఛార్టర్డ్ అకౌంటెన్సీ)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ రిజల్ట్స్ ICAI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
వెబ్‌సైట్: <>https://icai.nic.in/caresult/<<>>

News November 3, 2025

అచ్చంపేట: రేషన్ గోదాంలో 257 క్వింటాళ్ల దొడ్డు బియ్యం

image

2024 ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. నిల్వ ఉన్న దొడ్డు బియ్యం గురించి సివిల్ సప్లై అధికారులు నిర్లక్ష్యం చేశారు. దీంతో అచ్చంపేట పట్టణంలోని సివిల్ సప్లై గోదాంలో 257 క్వింటాళ్ల దొడ్డు రేషన్ బియ్యం ఏడాది కాలంగా తుట్టెలు కట్టి, పురుగులు పట్టీ ముక్కి పోతున్నాయి. అదే గోదాంలలో నిల్వ ఉన్న సన్న బియ్యనికి కూడ పురుగులు పడుతున్నాయి.