News March 3, 2025
జనగామ జిల్లా మైనార్టీ ఇన్ఛార్జ్ అధికారిగా విక్రమ్కుమార్

జనగామ జిల్లా మైనార్టీ ఇన్ఛార్జ్ అధికారిగా డిస్ట్రిక్ట్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ విక్రమ్కుమార్ అదనపు భాద్యతలు స్వీకరించారు. ఇదివరకు జిల్లా మైనారిటీ ఇన్ఛార్జ్ అధికారిగా కొనసాగిన బీసీ సంక్షేమ అధికారి రవీందర్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా జిల్లా మైనారిటీ బాధ్యతలను విక్రమ్ కుమార్కు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News December 31, 2025
చిత్తూరులో సెల్ఫోన్ దొంగల అరెస్ట్

చిత్తూరులో సెల్ ఫోన్లు చోరీచేసే ముగ్గురిని అరెస్టు చేసినట్లు రెండో పట్టణ సీఐ నెట్టికంటయ్య వెల్లడించారు. స్థానిక పీవీకేఎన్ కళాశాల వద్ద అనుమానంగా తిరుగుతున్న రాజేష్, లోకేశ్, రాకేశ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనం చేసినట్లు నిర్ధారణ కావడంతో వారి నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి చిత్తూరు జైలుకు తరలించారు.
News December 31, 2025
మార్కాపురం జిల్లా.. పెను సవాళ్లు ఇవేనా?

ఎట్టకేలకు మార్కాపురం జిల్లాగా ప్రకటించబడింది. 40 ఏళ్ల కల నెరవేరింది. కానీ మున్ముందు పెను సవాళ్లు కొత్త జిల్లాకు ఎదురుకానున్నాయని చర్చ సాగుతోంది. ప్రధానంగా జిల్లా అధికార యంత్రాంగానికి సరిపడ భవనాల కొరత వేధిస్తోంది. దీంతో ప్రభుత్వం నిధులను వెచ్చించి వాటిని నిర్మించాల్సి ఉంది. పారిశ్రామికంగా జిల్లాను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజలు మాత్రం ఉందిలే మంచి కాలం ముందుముందున అంటున్నారు.
News December 31, 2025
ఇప్పుడు హీరోగా చేయాలనే ఆలోచన లేదు: అనిల్ రావిపూడి

సినిమా ప్రమోషన్లలో హీరోహీరోయిన్లకు తగ్గకుండా డైరెక్టర్ అనిల్ రావిపూడి యాక్టివ్గా ఉంటారు. తాజాగా ఓ ఈవెంట్లో హీరోగా ఎంట్రీ ఎప్పుడిస్తారనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘మనం సక్సెస్ఫుల్గా ఉంటే ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. పొరపాటున అటువైపు వెళ్తే మన పని అయిపోయినట్లే. హ్యాపీగా మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్లాలి. ఇప్పట్లో హీరోగా చేసే ఆలోచన లేదు’ అని చెప్పారు.


