News July 9, 2025
జనగామ: నిరుద్యోగ యువతకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్లోని TGMBCDC ఆధ్వర్యంలో ఎంబీసీ నిరుద్యోగ యువతకు 4 రోజుల పాటు ఉచిత శిక్షణ కల్పించనున్నారు. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, రెస్యూమ్ బిల్డింగ్ వంటి అంశాల్లో శిక్షణతోపాటు టీఏ, భోజనం, వసతి సదుపాయాలు ఉంటాయని జనగామ జిల్లా బీసీ అభివృద్ధి అధికారి బి.రవీందర్ మంగళవారం తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల అభ్యర్థులు జులై 14లోగా దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.
Similar News
News July 9, 2025
గోల్డ్మన్ శాక్స్ సీనియర్ అడ్వైజర్గా రిషి సునాక్

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ గోల్డ్మన్ శాక్స్లో చేరినట్లు ఆ సంస్థ ప్రకటించింది. సీనియర్ అడ్వైజర్గా క్లయింట్స్కు మ్యాక్రోఎకనామిక్, జియో పొలిటికల్ వ్యవహారాల్లో సలహాలిస్తారు. 2001-2004 వరకు రిషి సునాక్ ఇదే సంస్థలో అనలిస్ట్గా ఉన్నారు. 2015, 17, 19లో రిచ్మండ్&నార్తల్లెర్టన్ MPగా గెలిచారు. బోరిస్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న ఆయన.. ప్రధానిగా ఎన్నికై OCT 2022-జులై 2024 వరకు సేవలందించారు.
News July 9, 2025
బాన్సువాడ: పొలంలో పడి ఊపిరాడక మృతి చెందిన వ్యక్తి

బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు గ్రామానికి చెందిన గెంట్యల బసవయ్య(41) మంగళవారం ఉదయం వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. పొలంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో ముఖం బురదలో కూరుకపోయింది. దీంతో ఊపిరాడక బసవయ్య మృతి చెందాడు. మృతుని భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అశోక్ తెలిపారు.
News July 9, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణ.. 200 ప్రత్యేక బస్సులు

ఈనెల 9న విశాఖలో జరిగే గిరి ప్రదక్షిణకు సింహాచలం కొండకింద నుంచి పైకి వెళ్లేందుకు, మరల పైనుంచి కిందకి వచ్చేందుకు 50 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. సింహాచలం నుంచి నగరంలోకి వచ్చేందుకు 150 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జులై 9, 10వ తేదీల్లో సిబ్బందికి విధించిన డ్యూటీల మేరకు హాజరవ్వాలన్నారు.