News March 20, 2025

జనగామ: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో

image

శుక్రవారం ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మొత్తం 41 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, మూత్ర శాలలు, బెంచీలు, ఫ్యాన్లు, తదితర వసతులన్నీ కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

Similar News

News March 21, 2025

ఆ రోడ్లకు టోల్ విధించే ఆలోచన లేదు: మంత్రి కోమటిరెడ్డి

image

TG: గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. వాటికి చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని అసెంబ్లీలో దుయ్యబట్టారు.

News March 21, 2025

ఢిల్లీలో పెట్రోల్‌తో నడిచే బైక్స్‌కు నో రిజిస్ట్రేషన్?

image

ఢిల్లీలో గాలి నాణ్యతను పెంపొందించేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పెట్రోల్‌‌తో నడిచే బైక్& స్కూటీలను నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026 ఆగస్టు నుంచి ఎలక్ట్రిక్ బైక్స్‌కు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేలా ‘ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0’ తీసుకొస్తారని సమాచారం. అలాగే, ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇంధనంతో నడిచే త్రిచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ కూడా నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.

News March 21, 2025

హామీలకు మంగళం అన్న BRS.. Tకాంగ్రెస్ సెటైర్లు

image

తెలంగాణ రాజకీయం సోషల్ మీడియా వేదికగా రసవత్తరంగా మారుతోంది. ‘ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు సీఎం రేవంత్ మంగళం పాడారు. బడ్జెట్‌లో ఒక్క హామీకి కూడా నిధులు కేటాయించని కాంగ్రెస్ ప్రభుత్వం’ అని బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌కు టీకాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ‘కచరా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ.. ఇక్కడ తాజాగా ఫేక్ న్యూస్‌లు తయారు చేయబడును’ అని కేటీఆర్ కార్టూన్‌ను షేర్ చేసింది. దీనిపై మీ కామెంట్?

error: Content is protected !!