News January 27, 2025

జనగామ: పురపాలిక ప్రత్యేకాధికారిగా పింకేశ్ కుమార్

image

రాష్ట్ర ప్రభుత్వం పురపాలికల అదనపు బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో జనగామ పురపాలిక ప్రత్యేకాధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సోమవారం మునిసిపల్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్, పురపాలిక ప్రత్యేకాధికారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందించారు

Similar News

News July 4, 2025

యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు: కలెక్టర్

image

ఎరువుల షాపుల డీలర్లు, యజమానులు యూరియాను కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి హెచ్చరించారు. శుక్రవారం సంగెం మండలం గవిచర్ల, కాపుల కనపర్తి గ్రామాల్లో ఉన్న ఎరువుల షాపులు, కో-ఆపరేటివ్ సొసైటీలను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

News July 4, 2025

అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ములుగు కలెక్టర్

image

గోదావరి నీటి ప్రవాహం పెరుగుతోందని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ఏటూరునాగారం, మంగపేటలోని గోదావరి కరకట్టను ఆయన పరిశీలించారు. రాబోయే వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకొని సకాలంలో నివాస గ్రామాలను ఖాళీ చేయించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో తగినంత ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

News July 4, 2025

11 ఏళ్లలో TGకి మోదీ ఏం ఇచ్చారు?: ఖర్గే

image

TG: కార్యకర్తల కృషి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని AICC చీఫ్ ఖర్గే పేర్కొన్నారు. LB స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి సభలో మాట్లాడుతూ ‘రేవంత్, భట్టి కలిసి KCRను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. HYDలోని పెద్ద పరిశ్రమలన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి. 11 ఏళ్లలో TGకి మోదీ ఏం ఇచ్చారు? రూ.15 లక్షలు, ఏటా 2 కోట్ల జాబ్స్ ఇచ్చారా’ అని వ్యాఖ్యానించారు.